రెండు డిస్‌ప్లేలతో షియోమీ ఎం‌ఐ కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్.. లాంచ్ కి ముందే ఫీచర్స్ లీక్..

First Published Aug 9, 2021, 1:32 PM IST

చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీ కొత్త ఎం‌ఐ సిరీస్ ఫోన్ ఎం‌ఐ మిక్స్ 4ని లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఎం‌ఐ మిక్స్ 4 ఆగస్టు 10న లాంచ్ కానున్నట్లు షియోమీ  కూడా ధృవీకరించింది, అయితే ఈ లాంచ్ ఇండియాలో కాదు చైనాలో జరగనుంది. 

ఈ కొత్త ఫోన్ 2019 సంవత్సరంలో ప్రారంభించిన ఎం‌ఐ మిక్స్ 3 5జికి అప్‌గ్రేడ్ వెర్షన్. ఎం‌ఐ మిక్స్ 4లో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ అందించినట్లు భావిస్తున్నారు. దీనికి సంబంధించి గీక్‌బెంచ్ లిస్టింగ్ కూడా బయటపడింది, దీని ప్రకారం ఎం‌ఐ మిక్స్ 4  మోడల్ నంబర్ 2106118C. అంతేకాకుండా ఫోన్ లో ఆక్టా-కోర్ ప్రాసెసర్‌  అందించారు, ఇందులో 4 + 3 + 1 కోర్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫోన్‌ను స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో లాంచ్ చేయవచ్చు.

ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో 12జి‌బి ర్యామ్, అండ్రాయిడ్ 11తో జాబితా చేయబడింది. సింగిల్ కోర్ టెస్ట్ లో ఫోన్ 858 నుండి 1,164 వరకు స్కోర్ చేసింది, మల్టీకోర్ టెస్ట్ లో 2,995 నుండి 3,706 వరకు స్కోర్ చేసింది. ఎం‌ఐ మిక్స్ సిరీస్‌ను షియోమి 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టింది.
 

 ఈ సిరీస్ ఫోన్‌లు పూర్తిగా బెజ్‌లెస్‌గా వస్తాయి. సెల్ఫీ కెమెరా కోసం మాత్రమే చిన్న రంధ్రం ఉంటుంది. ఎం‌ఐ మిక్స్ ని ఆల్ఫా రౌండ్ డిస్‌ప్లేతో పరిచయం చేయనున్నారు. ఎం‌ఐ మిక్స్ ఫోల్డ్ డిజైన్ శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ లాగా ఉంటుంది.
 

గత నెలలో ఈ ఫోన్‌కి అండర్ డిస్‌ప్లే కెమెరా ఉందని వార్తలు వచ్చాయి. అండర్ డిస్‌ప్లే కెమెరా టెక్నాలజీకి సంబంధించి షియోమీ గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తోంది.  

click me!