అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్: ల్యాప్‌టాప్‌లపై రూ.30 వేల వరకు డిస్కౌంట్.. అందిస్తున్న ఆఫర్లు ఇవే..

First Published Aug 4, 2021, 12:46 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేడ్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ తీసుకొచ్చింది. ఈ అమెజాన్ సేల్ ఆగస్టు 5న ప్రారంభమై ఆగస్టు 9 వరకు కొనసాగుతుంది. ఈ 5 రోజుల అమెజాన్ సేల్ లో మొబైల్స్  అండ్ అసెసోరిస్ పై  40 శాతం తగ్గింపు, ఎలక్ట్రానిక్ వస్తువులపై 60 శాతం తగ్గింపు అందిస్తుంది.

ఈ సేల్‌లో మీరు టీవీలపై 55 శాతం తగ్గింపు ఇస్తుంది. మరోవైపు ఎస్‌బి‌ఐ కార్డ్ హోల్డర్లు క్యాష్‌బ్యాక్ రివార్డ్‌లను పొందవచ్చు. మీరు ఈ సేల్‌లో కెమెరా కొనాలనుకుంటే 60 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ట్రైపాడ్స్, హెడ్‌ఫోన్‌లు, స్పీకర్ల పై 60 శాతం వరకు తగ్గింపు కూడా ఉంది. ఎస్‌బి‌ఐ కార్డ్ హోల్డర్లకు 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

మీరు కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటే ఏకంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది, మీరు ప్రింటర్ లేదా ఇతర యాక్సెసరీలను కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు, వై-ఫై రౌటర్లు, మెమరీ కార్డులు, స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాలు మొదలైనవి 60% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
 

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, యాక్సెసరీస్‌పై 40 శాతం తగ్గింపు లభిస్తుంది. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌లకు మూడు నెలల పాటు నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఆప్షన్ లభిస్తుంది. ఇటీవల లాంచ్ చేసిన వన్ ప్లస్ నార్డ్ 2, వన్ ప్లస్  సి‌ఈ 5జి, స్యామ్సంగ్ ఎం21 2021, ఐకూ జెడ్3 5జి కూడా ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు.

40-అంగుళాల, 43-అంగుళాల స్మార్ట్ టీవీ మోడళ్లపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది. మీరు 4కె రిజల్యూషన్‌తో పెద్ద టీవీ లేదా ప్రొజెక్టర్‌ను కొనుగోలు చేస్తే మీరు 60 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్‌పై 45% వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

undefined
click me!