ఈ గెలుపుతో పారిస్ ఒలింపిక్స్లో భారత్కు నాలుగో పతకం లభించింది. నాలుగింటిలో ఒకటి హాకీ నుంచి, మరో మూడు మెడల్స్ షూటింగ్లో వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ మూడో స్థానంలో నిలిచింది. అలాగే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్తో కలిసి మను భాకర్ కాంస్యం గెలుచుకుంది. దీని తర్వాత పురుషుల 50 మీటర్ల రైఫిల్ లో స్వప్నిల్ కుసాలే మూడవ స్థానంలో నిలిచి భారత్ కు మరో కాంస్యం అందించాడు.