చైనాకు షాకిచ్చిన భారత్

First Published Sep 17, 2024, 7:19 PM IST

Hockey Asian Champions Trophy 2024: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో చైనాను చిత్తుగా ఓడించింది భారత్. 5వ సారి టైటిల్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది.

Hockey, India

Asian Champions Trophy 2024 hockey: హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత పురుషుల హాకీ జట్టు మంగళవారం (సెప్టెంబర్ 17) చైనాలోని డౌర్ ఎత్నిక్ పార్క్, హులున్‌బుయిర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టోర్నమెంట్ ఫైనల్‌లో ఆతిథ్య చైనాను చిత్తుగా ఓడించింది. 5వ సారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 

పారిస్ ఒలింపిక్స్ 2024 కాంస్య పతకాన్ని గెలుచుకున్న భారత పురుషుల హాకీ జట్టు తన జోరును కొనసాగిస్తోంది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024 హాకీ టోర్నమెంట్ లో 6వ సారి ఫైనల్‌ కు చేరుకుంది. భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు చైనాను ఫైనల్ లో చిత్తు చేశారు. 

మంగళవారం (సెప్టెంబర్ 17) హులున్‌బుయిర్‌లోని దౌర్ ఎత్నిక్ పార్క్‌లోని మోకి హాకీ శిక్షణా స్టేడియం లో జరిగే ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ (ACT) 2024 ఫైనల్‌లో ఆతిథ్య చైనాతో తలపడింది. 1-0 తో విజయాన్ని అందుకుంది. 5వ సారి ట్రోఫీ సాధించింది. అంతకుముందు సోమవారం జరిగిన సెమీఫైనల్‌లో దక్షిణ కొరియాపై 4-1 తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ ఫైనల్‌కు చేరుకుంది.

Latest Videos


Hockey India

సోమవారం జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ 4-1తో కొరియాను ఓడించి రికార్డు స్థాయిలో ఆరో ఫైనల్‌కు చేరుకోగా, మంగళవారం రజతం కోసం చైనాతో తలపడింది. 

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్లో ఆతిథ్య చైనా ఓడించింది. 2011, 2016, 2018 (పాకిస్థాన్ తో సంయుక్త విజేత), 2018లో నాలుగు సార్లు ఆసియా చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ ఐదో టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగి అద్భుత విజయం సాధించింది. చైనా తొలి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగగా దానికి నిరాశే మిగిలింది.

ఈ టోర్నీ ఆరంభంలో భారత్, చైనా తలపడగా మెన్ ఇన్ బ్లూ జట్టు 3-0తో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది. ఓపెనింగ్ ఓటమికి చైనా ప్రతీకారం తీర్చుకోవాలని చూసింది కానీ భారత్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు.

మూడు గోల్ లెస్ క్వార్టర్ల తర్వాత నాలుగో క్వార్టర్ లో జుగ్ రాజ్ సింగ్ విజేతగా నిలవడంతో భారత్ ఐదో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను 1-0తో గెలుచుకుంది. దాదాపు 50 నిమిషాల పాటు ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో జుగ్ రాజ్ సింగ్ 51వ నిమిషంలో గోల్ సాధించాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో జట్టును ముందుండి నడిపించి 7 గోల్స్ చేసిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.

మ్యాచ్ పురోగమిస్తున్న కొద్దీ భారత్ అలసత్వం ప్రదర్శిస్తున్నప్పటికీ ఏదో విధంగా చైనాను నిలువరించగలిగింది. చైనాకు వరుసగా మూడు పెనాల్టీ కార్నర్లు లభించినా భారత్ ప్రతి ఒక్కటీ కాపాడుకోగలిగింది. 5వ సారి టైటిల్ గెలుచుకుంది.

click me!