ఈ సీజన్ రెండో దశ మ్యాచ్లు మొత్తం 12 నగరాల్లో జరగనున్నాయి. ఇందులో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్ వంటి ప్రధాన నగరాలతో పాటు ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్లలో కూడా మ్యాచ్లు జరగనున్నాయి. జట్లు తమ హోమ్ గ్రౌండ్లను ఇతర నగరాలకు కూడా విస్తరించాయి. ఉదాహరణకు, పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్లను న్యూ చండీగఢ్, ధర్మశాలల్లో ఆడనుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ మూడు హోమ్ మ్యాచ్లను బెంగళూరులో, రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది.