మంత్రాల జపం: వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు వేద మంత్రాలను పఠిస్తే పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. పూజా ఫలం దక్కాలంటే ఈ రోజున మీరు ఖచ్చితంగా శ్రీ హరి నామాలను జపించండి.
ఆలయాన్ని సందర్శించండి: పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు విష్ణువు ఆలయాన్ని ఖచ్చితంగా సందర్శించండి. పూజలు, ప్రార్థనలు చేయండి. అలాగే పేదలకు అవసరమైన ఆహారం, వెచ్చని దుస్తులు వంటి వాటిని దానం చేయండి. మీకు పుణ్యం దక్కుతుంది. అలాగే మీకు శాంతి, ఆనందం కలుగుతాయి.