6. రాత్రి జాగరణ:
రాత్రి నిద్రపోకుండా భగవంతుని కీర్తనలు పాడుతూ, మంత్ర జపం చేస్తూ ఉండాలి. ఈ విధంగా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి నారాయణుడి కృప కలుగుతుందని భక్తుల నమ్మకం.
వైకుంఠ ఏకాదశి వ్రత ఫలితం కారణంగా జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయట. విష్ణు కృపతో మోక్షం లభిస్తుందట. భక్తి భావన పెరిగి, జీవితం పవిత్రంగా మారుతుందని పురాణాల్లో ఉంది.
గమనిక:
వ్రతం అనేవి భక్తి, నమ్మకంతో పాటిస్తే మరింత ఫలప్రదమవుతుంది. మీరు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని మీ ఆరోగ్యం, శరీరం సహకరించే విధంగానే చేయాలి. కఠిన నియమాలు పాటించి ఆరోగ్యం పాడుచేసుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం, భక్తి, శ్రద్ధ లేకుండా చేసే ఏ పూజా ఫలితాలనివ్వవని పండితులు చెబుతున్నారు.