దీపావళి పండుగ ధనత్రయోదశి నుంచే ప్రారంభమవుతుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడే ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. ధనత్రయోదశి నాడు బంగారం, వెండితో చేసిన వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తారు. ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం పూట లక్ష్మీదేవిని, కుబేరుడిని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు యముడిని కూడా పూజించే ఆచారం ఉంది. అవును ఈ రోజు యమరాజుకు దీపాన్ని కూడా వెలిగిస్తారు. అసలు ధనత్రయోదశి నాడు యమ దీపాన్నిఎందుకు వెలిగిస్తారు.. దీని ప్రాముఖ్యత, సరైన సమయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..