చాణక్య నీతి ప్రకారం.. వీళ్లపై దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది

First Published Mar 25, 2024, 3:51 PM IST

ఆచార్య చాణక్య నీతి ప్రకారం.. కొంతమంది వ్యక్తులపై దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి వారికి జీవితంలో కష్టాలు, బాధలు ఎదురుకావు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం పదండి. 
 

Chanakya Niti

మన దేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన విధానాలలో చాణక్య నీతి ఒకటి. జీవితంలో విజయం సాధించే సూత్రాలు ఈ పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో కొంతమందికి ఎప్పుడూ దేవతల ఆశీస్సులు ఉంటాయని చెబుతాడు. దీని వల్ల వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు నిలిచి ఉంటాయి. అందుకే  ప్రతి వ్యక్తి తన జీవితంలో వచ్చే ప్రతి సందర్భాన్నిస్వీకరించాలి. దీంతో దేవతల అనుగ్రహం పొందుతారు.
 

Chanakya Niti

సమాజంలో గౌరవం

ఎప్పుడూ మతాన్ని అనుసరించే వ్యక్తి తనపై దేవతల అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడని ఆచార్య చాణక్యుడు చెప్తాడు. దీనివల్ల ఆ వ్యక్తి తన జీవితమంతా సుఖంగా గడుపుతాడు. అలాగే ఆ వ్యక్తికున్న లక్షణాల వల్ల సమాజంలో గౌరవం పొందుతాడు. 


జీవితంలో సంతోషం, శాంతి

ఆచార్య చాణక్యుడు కూడా.. తన జీవితంలో లభించిన ప్రతిదానికి తృప్తిగా ఉండేవారు కూడా ఆనందంగా ఉంటారని చెప్తాడు. ఇలాంటి వ్యక్తులపై  కూడా దేవతల ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దీనివల్ల  జీవితంలో మీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో శాంతి వాతావరణం ఉంటుంది. అందుకే ప్రతి వ్యక్తి తన జీవితంలో సంతోషం, శాంతిని కొనసాగించడానికి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 
 

భగవంతుని కృప 

ఈ లోకంలో ప్రతిదీ క్షణికమే. అందుకే ఈ పరివర్తన సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మసులుకోవాలి. అందుకే వస్తువుల పట్ల మమకారాన్ని పెంచుకోవడం ఆపేసే వ్యక్తులపై భగవంతుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. దీని వల్ల ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. 

click me!