బంగారం, వెండితో వీటిని కొనొచ్చు
అక్షయ తృతీయ నాడు చాలా మంది బంగారం, వెండిని బాగా కొంటుంటారు. అయితే మీరు వీటితో పాటుగా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనొచ్చు. అక్షయ తృతీయ నాడు వీటిని కొనుగోలు చేసిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని జ్యోతిష్యులు చెప్తారు. అంతేకాదు దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది.