గంటా సింగిల్ పాయింట్ ఎజెండా: కేటీఆర్ కలిసి వస్తే....

First Published Mar 20, 2021, 9:30 PM IST

ఇటీవలి కాలంలో ఉక్కు ఉద్యమమే సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం చేస్తున్నారు గంటా. అందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇప్పుడు అదే అంశం గురించి ఆయన హైదరాబాద్ లో కేటీఆర్ ని కలిశారు. 

ఏపీ టీడీపీ నేత, మాజీ మంత్రి విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు నేడు హైదరాబాద్‌ లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండటంతో.. గంటా .. నేరుగా తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడే ఆయనతో చర్చించారు. ఏం మాట్లాడారనేదానిపై క్లారిటీ లేకున్నప్పటికీ... ఊహాగానాలు మాత్రం ఉక్కు ఉద్యమం గురించే ఈ చర్చ జరిగిందని వినబడుతున్నాయి.
undefined
ఇటీవలి కాలంలో ఉక్కు ఉద్యమమే సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం చేస్తున్నారు గంటా. అందుకోసం ఆయన తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అటు బీజేపీలోకి వెళ్లలేక, ఇటు వైసీపీలో ఇమడలేక టీడీపీలోనే కొనసాగుతూ ఉక్కు ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఇప్పుడు అదే అంశం గురించి ఆయన హైదరాబాద్ లో కేటీఆర్ ని కలిశారు.
undefined
కేటీఆర్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరం అయితే విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో కూడా పాల్గొంటామని ప్రకటించారు. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రయివేటీకరిస్తున్నారని, అది ఇక్కడితో ఆగకుండా రేపు హైదరాబాద్ లో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రయివేటు పరం చేసే అవకాశం ఉందని అన్నారు.
undefined
అయితే కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కార్మికుల, ఆంధ్ర ప్రాంతం వారి ఓట్ల కోసమే ఇలా మాట్లాడారని విమర్శలు బలంగా వినిపించాయి. తొలుత వ్యవసాయ చట్టాల మీద ధర్నాలు, రాస్తారోకోలు చేసి, బంద్ లో కూడా పాల్గొన్న తెరాస నేతలు ఆ తరువాత వాటి గురించి మాట్లాడింది లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ అంతు తేలుస్తామంటూ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానన్న కేసీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదు. ఎన్నికల వేళ మాత్రమే ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఈ వ్యాఖ్యలు చేసారని బలంగా విమర్శలు వచ్చాయి.
undefined
కేటీఆర్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేసినా... ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు, గంటాతో సహా పోరాటం చేస్తున్నవారు స్వాగతించారు. కానీ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ పై చర్చిద్దామని.. కేటీఆర్ వద్దకు ఎవరు రాలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయం సాధించింది. విజయం తెరాస ను వరించబోతుందన్న విషయాన్నీ గ్రహించిన వెంటనే గంటా రంగంలోకి దిగారు. కేటీఆర్ మద్దతుతో… ఉద్యమానికి మరో రూపం ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
undefined
స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదు. ఆ విషయం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతూనే ఉంది. అయితే ఎన్నికలకు ముందు స్టాండ్ ఇప్పుడు.. కేటీఆర్ కొనసాగిస్తారా లేదా అనే విషయం మున్ముందు తేలుతుంది. ఎన్నికల వరకు బీజేపీ తో కయ్యం, ఆ తరువాత నెయ్యం అన్నట్టుగా తయారయింది తెరాస పరిస్థితి.
undefined
బీజేపీ అంతు చూస్తాం అని ఎన్నికల వేళ బీరాలు పలకడం, ఆ తరువాత కేంద్రంతో విభేదించి సాధించేదేమిటి అని మాట్లాడడం మనం చూస్తూనే ఉన్నాము. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ అంశంపై బీజేపీతో లడాయి పెట్టుకోవడానికి తెరాస నాయకత్వం సిద్దంగా ఉన్నట్టుగా అయితే కనబడడం లేదు. రాష్ట్రంలోని ఐటీఐఆర్ గురించే పూర్తి స్థాయి ఉద్యమానికి తెరాస తెరలేపడంలేదు.
undefined
కానీ గంటా మాత్రం … కేటీఆర్ స్టేట్ మెంట్ మీద ఆశతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొనమని ఆహ్వానించడానికి వచ్చారు. కేటీఆర్ సాయంతో ఉద్యమానికి మరింత ఊపు తీసుకువద్దామని గంటా ప్రయత్నంగా కనబడుతుంది. పార్టీలకతీతంగా విశాఖ ఉక్కు పరిరక్షణ అంటూ జేఏసీ పెట్టి, ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా తన రాజకీయ గ్రాఫ్ ని కూడా పెంచుకోవాలని చూస్తున్న గంటాకు టీఆర్ఎస్ మద్దుతు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కేటీఆర్ నో, కేసీఆర్ నో గనుక విశాఖ రప్పించగలిగితే గంటాకి అదొక అడ్వాంటేజ్ అని చెప్పక తప్పదు.
undefined
click me!