చైనా గుప్పిట్లో పాక్: భారత్ మీద విషం, అమెరికా వ్యూహం ఇదీ...
First Published Jun 26, 2020, 12:54 PM ISTప్రపంచంతోపాటుగా పాకిస్తాన్ లో కూడా మారణహోమం సృష్టించిన ఒసామా బిన్ లాడెన్ ఇప్పుడు ఉన్నట్టుండి పాకిస్తాన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు, అమరవీరుడు అయ్యాడు. పార్లమెంటు సాక్షిగా ఈ వ్యాఖ్యలు చేసాడు ఇమ్రాన్ ఖాన్. ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలను బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాట్లాడాడు. అసందర్భంగా, పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వాస్తవికంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో ఒకసారి చూద్దాము.