ఈ క్రమంలోనే బీసీల ఆదరణ పొందేందుకు ఈటల రాజేందర్ ద్వారా ప్రణాళికలను అమలు చేయిస్తుంది. ఆ ప్రణాళికకు తుది మెరుగులు దిద్దుతూ ముదిరాజ్, యాదవ్, మున్నూరు కాపు, పద్మశాలి, గంగపుత్ర సంఘం నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ముదిరాజ్ కమ్యూనిటీతో పలుకుబడి ఉన్న ఈటల ముదిరాజ్, యాదవ వర్గాల మధ్య సమన్వయం సాధించేందుకు సిద్ధమయ్యారు. కులాల నేతలతో చర్చలు జరిపి జనాభా నిష్పత్తి ప్రకారం రెండు వర్గాలకు టికెట్లు ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా పద్మశాలి నేతల అభిప్రాయాలను కూడా తీసుకుంటున్నారు.