తక్కువే అయినా పాములు అన్ని చోట్లా ఉండే జీవులు. కానీ మన దేశంలో ఒక రాష్ట్రంలో పాములే లేవంటే నమ్ముతారా? అవును పాములే లేని రాష్ట్రం ఒకటుంది. అదెక్కడో.. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
సాధారణంగా అన్ని చోట్లా పాములు ఉంటాయి. ఇది భూమి మీద నివసించే ఒక జీవి. విషకారి అయినా కాకపోయినా, పాముని చూడగానే జనాలు భయపడతారు. ప్రపంచవ్యాప్తంగా పాము అత్యంత ప్రమాదకరమైన విష జీవిగా పరిగణించబడుతుంది.
26
భారతదేశంలో దాదాపు 350 కంటే ఎక్కువ రకాల పాములు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, వాటి సంఖ్య ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో పాములను తరచుగా చూడవచ్చు. నగరాల్లో కూడా వాటి చూస్తుంటాం. మీకు తెలుసా, భారతదేశంలో ఉన్న పాముల్లో 17 శాతం మాత్రమే విషపూరితమైనవి. కానీ వాటన్నింటినీ అందరూ గుర్తించలేరు.
36
పాములు లేని భారత రాష్ట్రం
మన దేశంలోనే కేరళ రాష్ట్రంలో పాముల జాతులు ఎక్కువగా ఉన్నాయి. కానీ పాములే లేని ఒక రాష్ట్రం ఉందని మీకు తెలుసా? వినడానికి మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ అది నిజం.
46
పాములు లేని భారత రాష్ట్రం
కొన్ని నెలల క్రితం ఆ రాష్ట్రాన్ని అందమైన రాష్ట్రంగా వార్తల్లో కూడా ప్రచురించారు. ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం. దాని పేరు లక్షద్వీప్. దీవి మొత్తం జనాభా దాదాపు 64 వేలు మాత్రమే అనేది గమనార్హం. ఇందులో 96 శాతం మంది ముస్లింలు, మిగిలిన నాలుగు శాతం మంది హిందువులు, బౌద్ధులు మరియు ఇతర మతాల వారు ఉన్నారు.
56
పాములు లేని భారత రాష్ట్రం
లక్షద్వీప్లో 36 దీవులు ఉన్నాయి. కానీ వీటిలో 10 దీవుల్లో మాత్రమే ప్రజలు నివసిస్తున్నారు. కవరట్టి, అగట్టి, అమిని, కిల్తాన్, చెట్లాట్, కడమత్, బిత్రా, ఆండ్రోత్, కల్పేని, మినికాయ్ దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ దీవుల్లో 100 కంటే తక్కువ మంది ఉన్నారు. లెక్క ప్రకారం లక్షద్వీప్ పాములు లేని రాష్ట్రం.
66
పాములు లేని భారత రాష్ట్రం
ఇంతే కాకుండా, ఈ దీవిలో కుక్కలు కూడా లేవు. ఇక్కడి ప్రభుత్వం పాములు, కుక్కలు లేని దీవిగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నిస్తోంది. ఈ దీవికి వచ్చే పర్యాటకులు కుక్కలను తీసుకురావడానికి అనుమతి లేదు.