తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వెదర్ అప్డేట్.. వేసవి తాకిడి ఎలా ఉంటుందో !
దేశంలోని అనేక ప్రాంతాల్లో వేడి నెమ్మదిగా ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు బలంగా వీస్తున్నాయి. ఎండలు మండిపోతున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, ఉత్తర కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో 35 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వాతావరణ శాఖ ప్రకారం, మార్చి 20 తర్వాత, దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతాయి. వేడి ప్రభావాన్ని చూపడం ప్రారంభమవుతుంది.