షాకింగ్ : 8 రోజుల్లో, 8 మంది చిన్నారులపై అత్యాచారం.. !!

First Published Mar 25, 2021, 1:03 PM IST

బీహార్ లో చిన్నారులపై ఓ మృగాడి వేట కొనసాగింది. పదిరోజుల్లో ఎనిమిదిమంది చిన్నారులపై పాశవికంగా లైంగిక దాడి చేశాడో నీచుడు. పచారీ కొట్టు నడుపుతూ చాక్లెట్ల ఆశ చూపి 5, 7 యేళ్ల వయసున్న ఎనిమిది మంది చిన్నారుల మీద అత్యాచారానికి తెగబడ్డాడు. 

బీహార్ లో చిన్నారులపై ఓ మృగాడి వేట కొనసాగింది. పదిరోజుల్లో ఎనిమిదిమంది చిన్నారులపై పాశవికంగా లైంగిక దాడి చేశాడో నీచుడు. పచారీ కొట్టు నడుపుతూ చాక్లెట్ల ఆశ చూపి 5, 7 యేళ్ల వయసున్న ఎనిమిది మంది చిన్నారుల మీద అత్యాచారానికి తెగబడ్డాడు.
undefined
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అభం, శుభం ఎరుగని ఆ చిన్నారులకు తమ మీద ఎంత భయంకరమైన, నీచమైన దాడి జరిగిందో తెలియదు.
undefined
దీంతో తమను ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ముందు అమాయకంగా ఆ దుర్మార్గుడు ఏం చేశాడో పూసగుచ్చినట్టు చెప్పారు.
undefined
దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలానికి దారి తీసింది. విషయం తెలిసిన పోలీసులు నిందితుడైన పచారీ కొట్టు యజమాని ప్రకాష్ తంతీ అలియాస్ రాజీవ్ తాంతీని అరెస్ట్ చేశారు.
undefined
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాష్ తంతీ అలియాస్ రాజీవ్ తాంతీ గ్రామంలో కిరాణా షాపు నడుపుతున్నాడు. తన షాపుకు వచ్చే చిన్నారుల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవాడు. అలా పది రోజుల్లో 8మంది చిన్నారుల మీద ఆకృత్యానికి పాల్పడ్డాడు.
undefined
గతేడాది కూడా ప్రశాష్ తన షాపులో ఇద్దరు చిన్నారుల మీద లైంగిక దాడి చేశాడని, ఆ తరువాత వారికి చాక్లెట్లు ఇచ్చి మభ్యపెట్టాడని గ్రామస్తులు తెలిపారు.
undefined
ప్రకాష్ గురించి అంతకు ముందే విషయం తెలిసీ చూడనట్టుగా వదిలేసిన గ్రామస్తులు, పోలీసుల నిర్లక్ష్యం కలిసి ఎనిమిది రోజుల్లో ఎనిమిది మంది చిన్నారుల జీవితాల్ని చిదిమేసేలా చేశాయి.
undefined
పోలీసులు ఎనిమిది మంది చిన్నారులను వైద్యపరీక్షల నిమిత్తం పంపించారు. నిందితుడిని ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఇంత క్రూరమైన చర్యకు పాల్పడిన అతని మానసిక పరిస్థితినీ పరిశీలిస్తున్నారు.
undefined
click me!