ఒలింపిక్స్ మెడలే కాదు... ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకున్నావ్..: మీరాబాయి చానుతో కిషన్ రెడ్డి

First Published Jul 27, 2021, 10:16 AM IST

ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. 

న్యూడిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో తొలిరోజే రజత పతకంతో బోణీకొట్టి భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వెయిట్ లిప్టర్ మీరాబాయి చానుకు స్వదేశంలో భారీ స్వాగతం లభించింది. జపాన్ నుండి రజత పతకంతో భారత్ కు చేరుకున్న ఆమెకు క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు.
undefined
ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ...ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్‌ విభాగంలో రజత పతకం సాధించిన పద్మశ్రీ సైఖోమ్ మీరాబాయి చానుకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. భరతమాత గర్వించేలా మన దేశ కుమార్తెలు పతకాలు గెలుచుకోవడం పట్ల తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందన్నారు. ఒలింపిక్స్ లో వెయిట్ లిప్టింగ్ లో ప్రతిభ చూపించిన చాను కేవలం వెండి పతకాన్నే కాదు ప్రతి భారతీయ హృదయాన్నీ గెలుచుకుందని కిషన్ రెడ్డి అన్నారు.
undefined
"దృఢసంకల్పం, నిరంతర కృషి , సవాళ్ళను అధిగమించాలనే తపన మనం కన్న కలలను సాధించడానికి ఏకైక మార్గం అని మీరాబాయి మరొకసారి నిరూపించారు. ఆమె సాధించిన విజయం క్రిడా ప్రపంచానికే కాకుండా లక్ష్యం దిశగా శ్రమించే ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది'' అన్నారు కిషన్ రెడ్డి.
undefined
"మీరాబాయి సుదీర్ఘ ప్రయాణానికి ఈ విజయం తొలిమెట్టు అలాగే మున్ముందు ఆమె సాదించబోయే విజయాలను చూసి మనందరం గర్వించే క్షణాలకు నాంది. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆమెకు తోటి భారతీయులందరి మద్దతు ఉంటుందని విశ్వసిస్తున్నాను" అన్నారు.
undefined
"దేశానికి గర్వించదగ్గ పురస్కారాలను అందించటంలో ఈశాన్య రాష్ట్ర యువత క్రీడల పట్ల చూపిస్తున్న ఉత్సాహం, వారి చురుకైన క్రీడా సంస్కృతి దోహద పడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
undefined
click me!