ఎలుకను కాపాడేందుకు తాను కాలువలో వెతికానని, అయితే అది తర్వాత చనిపోయిందని శర్మ చెప్పారు. ఆ తర్వాత అతను ఇతర జంతు ప్రేమికులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకుని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, ఆ జిల్లాలో ఎలుకకు పోస్టుమార్టం చేసే సౌకర్యం లేదని స్టేషన్లో శర్మకు తెలిపారు. కానీ, నిందితులమీద కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని.. దీనికోసం ఎలుకకు పోస్ట్మార్టం చేయాలని కార్యకర్త మొండిపట్టు పట్టాడు.