కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుపాటుకు 40 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త మరణించాడని, కనీసం 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఇండాస్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రసంగిస్తున్న ర్యాలీలో ఈ సంఘటన జరిగింది.