రైల్వే లోని ఏసీ 1, ఏసీ 2, ఏసీ 3 బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఒక దుప్పటి, దిండు, రెండు బెడ్ షీట్లు, ఒక టవల్ వంటి బెడ్డింగ్ ఉచితం. అయితే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించేవారు ఈ సేవ కోసం ₹25 చెల్లించాలి. ఇక కొన్ని రైళ్లలో, స్లీపర్ క్లాస్ ప్రయాణికులు అదనపు ఛార్జీ చెల్లించి బెడ్డింగ్ పొందవచ్చు.