ఆప్ అగ్రనాయకులకూ ఓటమి తప్పదా?
డిల్లీలో వరుస విజయాలను అందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి పరాభవం తప్పేలా లేదు. ఆ పార్టీకి చెందిన హేమాహేమీలు సైతం ప్రస్తుతం వెనుకంజలో కొనసాగుతున్నారు. చివరకు ఆప్ అధ్యక్షుడు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుతం సీఎం ఆతిషి కూడా వెనుకంజలో వున్నారు.
న్యూడిల్లీ నియోజకవర్గంలో పోటీచేస్తున్న కేజ్రీవాల్ పై బిజెపి అభ్యర్థి పర్వేష్ సాహెబ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 9 రౌండ్లు ముగిసేసరికి 1,170 ఓట్ల వెనుకంజలో వున్నాడు కేజ్రీవాల్.కల్కజీలో 6 రౌండ్లు ముగిసే సరికి 3,231 ఓట్ల వెనుకంజలో ఉన్నారు సీఎం అతిషి.
ఆసక్తికర విషయం ఏమిటంటే లిక్కర్ స్కామ్ లో జైలుకువెళ్లి డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయిన మనీష్ సిసోడియా మాత్రం మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అతడు జంగ్ పురాలో 3,869 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరికొన్ని చోట్ల కూడా ఆప్ ఆధిక్యం కనబరుస్తోంది. అయితే బిజెపి, ఆప్ ల మధ్య అధిక్యాలు అతి తక్కువగా వున్నాయి. కాబట్టి తుది ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.