బూతులు ఎందుకు నిషేధించారంటే..:
మాటలే మనుషులను శతృవులను చేసేది. ఇద్దరి మధ్య మాటలు బావుంటే స్నేహం పెరుగుతుంది...అదే మాటలు బాగాలేకుంటే శతృత్వం పెరుగుతుంది. అంటే మనుషుల మధ్య తేడాలు రావడానికి నోటి మాటలే కారణమని మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లా సౌందాల గ్రామస్తులు గుర్తించారు.
ఇక మన మంచి నడవడికే భవిష్యత్ తరాలకు అబ్బుతుంది... వాళ్లు బాగుండాలంటే మనం కూడా సంస్కారంతో వుండాలని ఈ గ్రామస్తులు భావించారు. బూతుల వల్ల మహిళల ఆత్మగౌరవం దెబ్బతినడమే కాదు చిన్నపిల్లలు కూడా ఆ మాటలు నేర్చుకుని పాడయిపోతారు. ఇలా అనేక అనార్థాలకు బూతులు మాట్లాడటం కారణం అవుతుంది. కాబట్టి ఈ బూతులే వినపించకుండా గ్రామస్తులు నిషేధం విధించారు.
సరదాకే కాదు గొడవలు పడినా అసభ్య పదజాలం వాడటం ఈ గ్రామంలో నిషేదం. కేవలం పెద్దమనుషులు ఈ నిర్ణయం తీసుకోవడం కాదు గ్రామసభ పెట్టిమరీ బూతుల నిషేధానికి ఓ తీర్మానం చేసారు. గ్రామంలోని ప్రతిఒక్కరు తోటివారితో సఖ్యతగా వుండాలనేదే ఈ బూతులపై నిషేదం విధించినట్లు చెబుతున్నారు.