నీ పిరుదుల సైజ్‌ ఎంత అని అడిగేవారు..12ఏట నుంచే వేధింపులు.. బాడీ షేమింగ్‌పై ఇలియానా ఆవేదన

First Published Apr 29, 2021, 10:42 AM IST

బాడీ షేమింగ్‌పై ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నెటిజన్లు తన శరీరాకృతిపై అనేక వల్గర్‌ కామెంట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మాటల్లో చెప్పలేని విధంగా తనని ప్రశ్నిస్తున్నారని వాపోయింది. 
 

ఇలియానా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాడీ షేమింగ్‌(శరీరాకృతిపై హేళన చేయడం)పై వస్తోన్న విమర్శలపై, కామెంట్లపై స్పందించారు. నెటిజన్లు తన బాడీలోని మార్పులపై అడుగుతున్న ప్రశ్నలు వింటుంటే భయమేస్తుందని చెప్పింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ,
undefined
`నేను సోషల్‌ మీడియాలో బాడీ షేమింగ్‌పై వేధింపులకు గురి కావడం ఇప్పుడు కొత్తేమీ కాదు. నా 12ఏట నుంచి అలాంటి విమర్శలు, ప్రశ్నలు ఎదుర్కొన్నాను. అప్పటి నుంచి నాకు ఇలాంటి కామెంట్లు తప్పలేదు.
undefined
నా బాడీపై రకరకాల కామెంట్లు చేసేవారు. నీ పిరుదుల సైజ్‌ ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా? నీ కాళ్లు అలా ఉన్నాయేంటి? వంటి ప్రశ్నలు వేసేవారు. సోషల్‌ మీడియాలో వచ్చే మెసేజెస్‌లో ఓ పది అయినా ఇలాంటి ప్రశ్నలుండేవి.
undefined
నేను అనే కాదు, ఇతర హీరోయిన్లపై కూడా బాడీ షేమింగ్‌కి సంబంధించి కామెంట్లు ఎదుర్కొంటున్నారు. అవి ఆయా సెలబ్రిటీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఆ ప్రశ్నలతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనయ్యేదాన్ని. మూడేళ్ల క్రితం ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి.
undefined
అయితే మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి. నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుంది.. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని ఇలా కామెంట్లు చేసే నెటిజన్లు తెలుసుకోవాలి.
undefined
కామెంట్ల రూపంలో నెటిజన్లు పెట్టే హింసను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదనకు గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి. ఇలాంటి వేధింపులను తట్టుకోలేక ఓ సందర్భంలో వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మార్ఫియా అంటారట. ఈ రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేవాళ్లు కామెంట్‌ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడేది.
undefined
ఈ మానసిక వేదన అనేది గతం. ఇప్పుడు నేను చాలా మారిపోయా. ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదని బలంగా నిర్ణయించుకున్నా. మన గురించి మనం పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. దేన్నైనా ఈజీగా తీసుకోగలం. ధైర్యంగా ముందుకెళ్లగలం` అని తెలిపింది ఇలియానా.
undefined
ఒకప్పుడు తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా చివరగా రవితేజతో `అమర్‌ అక్బర్ ఆంటోని` చిత్రంలో నటించింది. ప్రస్తుతం హిందీలో రణ్‌దీప్‌ హుడాతో కలిసి `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` అనే చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అజయ్‌ దేవగన్‌తో `రుద్ర` అనే వెబ్‌ సిరీస్‌లో చేస్తుందని టాక్‌.
undefined
click me!