ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు

First Published May 20, 2019, 11:09 AM IST

ఎగ్జిట్ పోల్ ఫలితాలు: కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆశలు గల్లంతు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో చక్రం కాదు కదా, బొంగరం కూడా తిప్పలేరని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పలుమార్లు అన్నారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలిస్తే ఆయన మాటలే నిజమయ్యేట్లు కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెసేతర, బిజెపియేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేసి అధికారం చేజిక్కించుకోవాలనే కేసీఆర్ వ్యూహం బెడిసికొట్టినట్లేకనిపిస్తోంది.
undefined
లోకసభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఘోరంగా తింటాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బిజెపి పుంజుకున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలియజేస్తున్నాయి. దీంతో కేసీఆర్ ప్రాంతీయ పార్టీల వ్యూహరచనకు ఆదిలో గండి పడింది.
undefined
తెలంగాణలో టీఆర్ఎస్ అధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంచనా వేసినప్పటికీ కేంద్రంలో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తేల్చి చెప్పాయి. అయితే, తెలంగాణలో 16 స్థానాలను దక్కించుకోవడం కూడా టీఆర్ఎస్ అంత తేలిక కాదని ఎగ్దిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
undefined
ఫెడరల్ ఫ్రంట్ ను ముందుకు తీసుకుని వెళ్లడానికి కేసీఆర్ మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్, పి. విజయన్, దేవగౌడ, స్టాలిన్ వంటి నేతలను కలిశారు. వారిలో ఎక్కువ మంది కేసీఆర్ కు అనుకూలంగా స్పందించలేదు. వారు కాంగ్రెసును కూడా వ్యతిరేకించాలనే కేసీఆర్ ప్రతిపాదనకు అంగీకరించలేదు.
undefined
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా స్పందించిన నాయకులు ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఒకరు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాగా, రెండో నాయకుడు మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.
undefined
టైమ్స్ నౌ - విఎంఆర్ సర్వే ప్రకారం.... టీఆర్ఎస్ కు 13 సీట్లు, కాంగ్రెసుకు 2 సీట్లు, బిజెపికి 1 సీటు వస్తాయి. ఓవైసి ఎలాగూ విజయం సాధిస్తారు. రిపబ్లిక్ - సీ ఓటరు సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కు 14 సీట్లు, కాంగ్రెసు ఒక్క సీటు, బిజెపికి 1 సీటు, మజ్లీస్ కు 1 సీటు వస్తాయి.
undefined
రిపబ్లిక్ -జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ అంచనా ప్రకారం.... టీఆర్ఎస్ కు 14 నుంచి 15 స్థానాలు, కాంగ్రెసుకు సున్నా నుంచి 1 స్థానం, బిజెపికి 1 స్థానం, మజ్లీస్ కు 1 స్థానం దక్కుతాయి. సిఎన్ఎన్ న్యూస్ 18- ఐపిఎస్ఓఎస్ సర్వే ప్రకారం... టీఆర్ఎస్ కు 12 నుంచి 14, కాంగ్రెసుకు 1 నుంచి 2, బిజెపికి 1 నుంచి 2, మజ్లీస్ కు 1 సీట్లు వస్తాయి.
undefined
టైమ్స్ నౌ - విఎంఆర్ సర్వే ప్రకారం.... టీఆర్ఎస్ కు 13 సీట్లు, కాంగ్రెసుకు 2 సీట్లు, బిజెపికి 1 సీటు వస్తాయి. ఓవైసి ఎలాగూ విజయం సాధిస్తారు. రిపబ్లిక్ - సీ ఓటరు సర్వే ప్రకారం.. టీఆర్ఎస్ కు 14 సీట్లు, కాంగ్రెసు ఒక్క సీటు, బిజెపికి 1 సీటు, మజ్లీస్ కు 1 సీటు వస్తాయి.
undefined
న్యూస్ 24 - చాణక్య సర్వే ప్రకారం... టీఆర్ఎస్ కు 14 నుంచి 16 స్థానాలు, కాంగ్రెసు, బిజెపి, మజ్లీస్ తలో స్థానాలు దక్కించుకుంటాయి. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలిస్తే లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై దెబ్బ పడే అవకాశమే కనిపిస్తోంది. దానికితోడు, కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ ప్రయత్నాలకు గండి పడినట్లే.
undefined
click me!