అమ్మాయిలను అలా చూస్తే పురుషుల ఆయుష్షు పెరుగుతుందా.? విచిత్రమైన వాదనలో నిజమెంత..

Published : Mar 12, 2025, 03:49 PM ISTUpdated : Mar 12, 2025, 04:06 PM IST

ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో అసత్య వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సోషల్‌ మీడియా లేని రోజుల్లో కూడా ఒక వార్త బాగా వైరల్‌ అయ్యిందన్న విషయం మీకు తెలుసా.? పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వివరాలు వెల్లడయ్యాయంటూ ఓ కథనం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా కథనం.? అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..   

PREV
14
అమ్మాయిలను అలా చూస్తే పురుషుల ఆయుష్షు పెరుగుతుందా.? విచిత్రమైన వాదనలో నిజమెంత..

సుమారు 20 ఏళ్ల క్రితం ఓ కథనం వార్తల్లో నిలిచింది. ఇప్పుడు తాజాగా ఈ కథనం మళ్లీ వైరల్‌ అవుతోంది. ఈ కథనం ప్రకారం.. 'పురుషులు ప్రతీ రోజూ మహిళల ఛాతీ (బ్రెస్ట్‌)వైపు పది నిమిషాల పాటు చూస్తే వారి ఆరోగ్యం మెరుగవడమే కాకుండా, ఆయుష్షు కూడా పెరుగుతుంది'. ఈ కథనాన్ని ఇప్పటివరకు చాలా పత్రికలు నిజమని నమ్మాయి. న్యూస్ ఏజెన్సీ ఆఫ్ నైజీరియా (NAN) అనే ప్రభుత్వ మీడియా ఈ కథనాన్ని ప్రచురించింది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ పత్రికలు కూడా ప్రచురించాయి. 

24

ఈ కథనంలో పేర్కొన్న అంశాల ప్రకారం.. జర్మన్‌కు చెందిన కారెన్‌ వెదర్‌బై అనే శాస్త్రవేత్త నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 250 మంది పురుషులకు రోజూ 10 నిమిషాలు మహిళల ఛాతీ వైపు చూడమని చెప్పారు. మరికొందరిని అలా చూడకుండా ఉండమని చెప్పారు. అయితే మహిళల ఛాతిని చూసిన వారి ఆరోగ్యం మెరుగైందని పరిశోధనలో వెల్లడైనట్లు ప్రచారం చేశారు. న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ అనే ప్రసిద్ధ మెడికల్ జర్నల్‌లో ఈ  అధ్యయనం ప్రచురించారని ప్రచారం జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగిందన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. 

34

ఇదిలా ఉంటే ఈ అధ్యయనం పూర్తిగా నిరాధారమైందని గతంలో పలువురు నిపుణులు తేల్చి చెప్పారు. అయితే తాజాగా మళ్లీ ఈ వార్త కథనాలను కొన్ని పత్రికలు ప్రచురించడంతో ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. మహిళల ఛాతిని చూస్తే పురుషుల ఆయుష్షు పెరగడం అనేది పూర్తిగా తప్పని Snopes అనే ప్రసిద్ధ ఫ్యాక్ట్‌ చెకింగ్ సైట్ ఇప్పటికే చెప్పింది. ఇది శాస్త్రీయ అధ్యయనం కాదు… అసలు ఈ కథనానికి ఎటువంటి వైద్య ఆధారాలు లేవని తేల్చి చెప్పేసింది. 

44

ఇక ఈ కథనాన్ని 'న్యూ ఇంగ్లండ్ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో' పబ్లిష్‌ చేశారని కూడా ప్రచారం కూడా జరిగింది. అయితే అసలు అలాంటి ఒక జర్నల్‌ లేదని తేలింది. కాగా ఈ కథనాన్ని వీక్లీ వరల్డ్‌ న్యూస్‌ అనే అమెరికన్‌ టాబ్లాయిడ్‌లో 1997లో, 2000లో ప్రచురించింది. ఈ పత్రిక అసలు నిజాల్ని కాకుండా… ఊహలు, విచిత్రమైన కథలు, అసత్య కథనాలను పబ్లిష్‌ చేస్తూ పాపులర్‌ అయ్యింది.  కాబట్టి ఈ కథనం పూర్తిగా సత్యదూరమైంది. ఇందులో ఏమాత్రం శాస్త్రీయ ఆధారాలు లేవు. అసలు ఇలాంటి ఓ పరిశోధన నిర్వహించారనే దానికి కూడా ఆధారాలు లేవు. ఇంకా చెప్పాలంటే కారెన్‌ వెదర్‌బై అనే శాస్త్రవేత్తే లేరు. కాబట్టి ఇలాంటి కథనం సోషల్‌ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తే అస్సలు నమ్మకండి. 

click me!

Recommended Stories