నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షల కోసం అవివాహిత మహిళల దరఖాస్తులకు యుపిఎస్‌సి అనుమతి..

First Published Sep 24, 2021, 4:02 PM IST

సుప్రీంకోర్టు తీర్పు తరువాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవివాహిత మహిళలను నేషనల్ డిఫెన్స్, నావల్ అకాడమీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించింది . అయితే యూ‌పి‌ఎస్‌సి ఎన్‌డి‌ఏ పరీక్ష నవంబర్ 14న జరగాల్సి ఉంది. 
 

అధికారిక ప్రకటన ప్రకారం అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా upsconline.nic.inలో దరఖాస్తులను తెరవడానికి యూ‌పి‌ఎస్‌సి నిర్ణయించింది. ఈ పరీక్ష కోసం నేషనాలిటి, వయస్సు, విద్యా అర్హత మొదలైన వాటిలో అర్హత ఉన్న అవివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొంది.

డబల్యూ‌పి(C)లో  18/08/2021 నాటి ఉత్తర్వు ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ (II),2021 లో మహిళా అభ్యర్థులు పాల్గొనేందుకు    సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా  మధ్యంతర ఆదేశాలకు అనుగుణంగా అనుమతించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్ష కోసం దరఖాస్తు వెబ్‌సైట్ ( upsconline.nic.in )లో ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరవాలని నిర్ణయించింది. ఇందుకు నోటీసు నం. 10/2021-NDA-IIకు ఒక కొరిజిండం జారీ చేసింది.   దీనిని 09/06/2021 న ప్రచురించారు. పైన పేర్కొన్న కొరిజెండం కమిషన్ వెబ్‌సైట్ ( www.upsc.gov.in )లో అందుబాటులో ఉంది .  

శారీరక ప్రమాణాలు, మహిళా అభ్యర్థుల ఖాళీల వివరాలు రక్షణ మంత్రిత్వ శాఖ నుండి వెలువడిన తర్వాత తెలియజేస్తామన్నారు. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 8 వరకు (సాయంత్రం 6 గంటల వరకు) మహిళా అభ్యర్థుల కోసం అప్లికేషన్ విండో తెరిచి ఉంటుందని యుపిఎస్‌సి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

"నిర్దేశించిన చివరి తేదీ/సమయం అంటే 08.10.2021 (సాయంత్రం 6 గంటల వరకు) లేదా పైన పేర్కొన్న ఆన్‌లైన్ మోడ్ కాకుండా మరే ఇతర మోడ్ ద్వారా ఎలాంటి  అప్లికేషన్ కూడా ఆమోదించబడదు. ఈ పరీక్ష కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు "అని ప్రకటనలో పేర్కొంది.
 

మహిళా అభ్యర్థుల కోసం మొదటి నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) పరీక్షను వాయిదా వేయాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. మహిళల హక్కును నిరాకరించడం తమకు ఇష్టం లేదని పేర్కొంది. మహిళల ప్రవేశాన్ని ఒక సంవత్సరం వరకు వాయిదా చేయలేము అని చెప్పింది.  


మహిళా  అభర్ధుల  కోసం ఎన్‌డి‌ఏ నోటిఫికేషన్ వచ్చే ఏడాది మే నాటికి విడుదల చేయబడుతుందని ప్రభుత్వం ఇంతకుముందు సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పిటిషనర్ కుష్ కల్రా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది చిన్మోయ్ ప్రదీప్ శర్మ సమర్పించిన వాదనలను అత్యున్నత న్యాయస్థానం గుర్తించి, మహిళల ప్రవేశాన్ని ఒక సంవత్సరం వాయిదా వేయలేమని చెప్పింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సమర్పించిన ప్రకారం మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేయబడింది, అలాగే మే 2022 నాటికి దానిని సులభతరం చేయడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవచ్చు అని తెలిపారు. ఎఎస్‌జి తదుపరి ఎన్‌డిఎ ప్రవేశ పరీక్షను నవంబర్ 14న నిర్వహించాల్సి ఉంది. 
 

click me!