10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. క్వాషన్ పేపర్ నమూనా విడుదల.. ఇవి తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Sep 03, 2021, 01:12 PM IST

న్యూఢిల్లీ: సి‌బి‌ఎస్‌ఈ బోర్డ్  10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఒక పెద్ద వార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సి‌బి‌ఎస్‌ఈ) పదవ  తరగతి, 12 వ తరగతి (2021-22 సెషన్) టర్మ్ 1 పరీక్ష కోసం సాంపుల్ పేపర్ అలాగే మార్కింగ్ స్కీమ్ విడుదల చేసింది. దీని ప్రకారం టర్మ్ 1 పరీక్షలు 2021 నవంబర్-డిసెంబర్‌లో జరుగనున్నాయి.  

PREV
13
10వ తరగతి, ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్..  క్వాషన్ పేపర్ నమూనా విడుదల.. ఇవి తెలుసుకోండి..

10వ అలాగే 12 వ తరగతి విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి మార్కింగ్ స్కీమ్ అండ్ నమూనా పేపర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తదనుగుణంగా సిద్ధం కావాలని సూచించారు. నమూనా పేపర్‌లో పరీక్షలో కనిపించే ప్రశ్నలతో సహా ప్రశ్నల రకం వివరాలు పొందుపరిచారు.
 

23

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 2021 పరీక్షలను బోర్డు రద్దు చేసిన సంగతి మీకు తెలిసిందే. అలాగే విద్యార్థులు ఇంటర్నల్ అసెస్‌మెంట్ ఆధారంగా ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా పరీక్షను రద్దు చేయాల్సిన అవసరం లేనందున బోర్డు సిలబస్‌ను రెండు సమాన భాగాలుగా టర్మ్ 1 అండ్ టర్మ్ 2 విభజించింది. 
 

33

టర్మ్ 1  ఎం‌సి‌క్యూ  లేదా ఆబ్జెక్టివ్ పేపర్ ఇంకా 50% సిలబస్ ఆధారంగా ఉంటుంది. పరిస్థితులని బట్టి  పరీక్షలు ఆఫ్‌లైన్‌లో లేదా ఆన్‌లైన్‌లో జరుగుతుంది.

click me!

Recommended Stories