ఫిఫా తాజా నిర్ణయం భారత ఫుట్బాల్ కు భారీ షాకే. దీంతో భారత పురుషుల, మహిళల జట్లు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడేందుకు వీళ్లేదు. జూనియర్, సీనియర్ స్థాయిలలో కూడా మ్యాచ్ లు రద్దవుతాయి.వీటన్నింటికంటే ముఖ్యంగా ఈ ఏడాది భారత్ వేదికగా జరగాల్సి ఉన్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు కూడా భారత్ కోల్పోయింది. అక్టోబర్ 11 నుంచి 30 వరకు భారత్ ఈ టోర్నీని నిర్వహించేందుకు గాను హక్కులు పొందిన విషయం తెలిసిందే.