సమంత ఆ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదా.. భరిస్తూనే షూటింగ్, 'యశోద' నటుడు కామెంట్స్ వైరల్

First Published Nov 4, 2022, 7:15 PM IST

యశోద చిత్రం నవంబర్ 11న రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే. సమంత దాదాపుగా కోలుకోవడం ఊరటనిచ్చే అంశం. అయితే పూర్తిగా కోలుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.  దీనితో సమంతకి మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.   

సమంత కొన్ని నెలల క్రితమే యుఎస్ కి ట్రీట్మెంట్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అంటే అంతకు ముందే ఆమెకు మయోసైటిస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సమయంలో సమంత యశోద చిత్ర షూటింగ్ తో బిజీగా ఉంది. కానీ సమంత తన వ్యాధి గురించి ఎవరికీ చెప్పకుండా భరిస్తూనే షూటింగ్ లో పాల్గొన్నట్లు అర్థం అవుతోంది. 

యశోద నటుడు ఉన్ని ముకుందన్ చేసిన కామెంట్స్ బట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. యశోద చిత్రం నవంబర్ 11న రిలీజ్ రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. తాజాగా ఇంటర్వ్యూలో ఉన్ని ముకుందన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉన్ని ముకుందన్ జనతా గ్యారేజ్, భాగమతి, ఖిలాడీ లాంటి చిత్రాల్లో నటించారు. ఇప్పుడు యశోదలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ అయ్యే వరకు తన రోల్ ఏంటనేది సస్పెన్స్ అని తెలిపారు. 

సమంత చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అద్భుతంగా నటించింది. సెట్స్ లో ఆర్టిస్టులందరిని ప్రేమగా పలకరించే మంచి నటి సమంత. సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది అని తెలిసి ఎంతో బాధపడ్డా. షూటింగ్ సమయంలో ఆమె ఆ వ్యాధితో బాధపడుతున్నట్లు నాకు తెలియదు. 

కానీ సమంతని దగ్గర నుంచి గమనించిన వ్యక్తిగా చెబుతున్నా.. ఆమె పోరాటం చేసి ఆయా వ్యాధి నుంచి బయటపడుతుంది. ఆరోగ్యంగా తిరిగి వస్తుంది అని ఉన్ని ముకుందన్ తెలిపారు. యశోద చిత్రం సరోగసి నేపథ్యంలో హరీష్ - హరి దర్శకత్వంలో తెరకెక్కింది. 

ఉత్కంఠ భరితమైన అంశాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మయోసైటిస్ కారణంగా సమంత యశోద ప్రమోషన్స్ లో పాల్గొంటుందా అనేది అనుమానంగా మారింది. 

click me!