పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత, ఈనాడు మరియు మార్గదర్శి సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం చాలా ఆవేదనకు గురిచేసింది. ఆరు నెలల క్రితం శ్రీ రామోజీరావు గారితో మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో వారు నాతో మాట్లాడిన ప్రతిమాట ఇంకా గుర్తుంది. అలాంటి పట్టుదల, వ్యక్తిత్వం, క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు కోటికొక్కరు మాత్రమే ఉంటారు. అరాచక పాలన నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలను కాపాడటం కోసం ఆయన చేసిన కృషి అద్వితీయం. తెలుగు ప్రజలను కాపాడిన తృప్తితో ఆయన కన్ను మూశారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.