ఇవన్నీ మనసులో పెట్టుకున్న రాజమౌళి కమెడియన్ సునీల్ తో మర్యాద రామన్న మూవీ చేసి హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఈగ అనే ప్రయోగాత్మక చిత్రం చేశాడు. ఈగ బాలీవుడ్ లో కూడా సత్తా చాటింది. చిరంజీవి కామెంట్స్ కి హర్ట్ అయిన రాజమౌళి... ఓ కమెడియన్ ని, అలాగే చిన్న ఈగను హీరోగా పెట్టి మూవీ తీసి హిట్ కొట్టగలనని పరోక్షంగా సందేశం పంపించాడట.
అల్లు అరవింద్, చిరంజీవి మగధీర విషయంలో ప్రవర్తించిన తీరు నచ్చని రాజమౌళి ఇకపై మెగా హీరోలతో సినిమాలు చేయకూడదని అనుకున్నాడట. ఆ కారణంగానే అల్లు అర్జున్ తో రాజమౌళి ఒక్క సినిమా చేయలేదట. చిరంజీవి, అల్లు అరవింద్ లపై ఉన్న కోపం అల్లు అర్జున్ బలి అయ్యేలా చేసిందట. ఈ మేరకు గతంలో కథనాలు వెలువడ్డాయి.