ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?

First Published Oct 22, 2024, 8:19 AM IST

ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు. కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు. నిత్యావసర సరుకులు కూడా అప్పులు చేసేవారట. 
 

రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు. అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది. 

ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. వేల కోట్ల వసూళ్లు తెలుగు సినిమాకు సాధ్యమే అని నిరూపించాడు. నిజానికి వందల కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. 

ప్రస్తుతం రాజమౌళికి ఉన్న డిమాండ్ రీత్యా సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం. రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న రాజమౌళి భారీగా ఆర్జించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 158 కోట్లు ఉంటుందని ఒక అంచనా. సినిమా రెమ్యూనరేషన్ ఆయన ప్రధాన ఆదాయమార్గం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. 
 

Latest Videos



రిచెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న రాజమౌళి ఒకప్పటి జీవితం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అత్యంత పేదరికం రాజమౌళి కుటుంబం అనుభవించిందట. నిత్యావసర సరుకులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేదట. ఈ విషయం రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు. జీవితంలో మీకు ఎదురైన అవమానాలు ఏమిటని అడగ్గా.. 

మేము చెన్నైలో ఉన్న రోజుల్లో నాన్న ఘోస్ట్ రైటర్ గా పని చేసేవాడు. ఈ ఘోస్ట్ రైటర్స్ కి ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు కిరాణా కొట్టులో చేసిన అప్పు తీర్చేవాళ్ళం. మరలా అప్పు తెచ్చుకునేవాళ్ళం. కిరాణావాడు రూ. 100-150 రూపాయల అప్పు వరకు బాగానే ఇచ్చేవాడు. తర్వాత విసుక్కునేవాడు. 

ఒకరోజు కూరగాయల కోసం నేను దుకాణానికి వెళ్ళాను. వాడు ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. నేను ఒకటికి రెండు సార్లు... అన్నా నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. వాడు పట్టించుకోవడం లేదు. నేను గట్టిగా అన్నా... కూరగాయలు ఇవ్వు అనగానే... 'పోరా' అని అరిచాడు. అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది. నేను పెద్దయ్యాక డబ్బులు సంపాదించి, కిరాయి మనుషులతో వీడిని కొట్టించాలని అప్పుడు నాకు అనిపించింది, అని రాజమౌళి చెప్పుకొచ్చాడు. 

బహుశా బాల్యంలో రాజమౌళి అంతటి పేదరికం అనుభవించడం వల్లనేమో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అతిగా దానధర్మాలు చేయరు. కరోనా సమయంలో ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. రాజమౌళి తక్కువ మొత్తం ఇచ్చాడు. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరదలు సంభవించాయి. నటులు, దర్శక నిర్మాతలు విరాళాలు ఇచ్చారు. రాజమౌళి ప్రకటించిన దాఖలాలు లేవు. 
 

ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ 2025 జనవరిలో ప్రారంభం కానుందట. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎస్ఎస్ఎంబి 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా.  దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట. 

ఈ వారం పక్కాగా ఇంటికి వెళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు?

Mahesh,rajamouli

ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేయనున్నారని సమాచారం. మరోవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం సరికొత్తగా సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొడవాటి జుట్టు, గుబురైన గడ్డంతో మహేష్ లుక్ అంచనాలు పెంచేదిగా ఉంది. రాజమౌళి తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా ప్రజెంట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. 

click me!