అంతా ఐశ్వర్య వెంటపడుతుంటే.. ఆమె మాత్రం అతని వెంట పడేదట!

First Published Sep 17, 2020, 11:53 AM IST

లాక్ డౌన్ సమయంతో సినీ తారలకు సంబంధించిన పాత విషయంలో చాలా తెర మీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఐశ్వర్య రాయ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఐష్‌ స్నేహితురాలు శివానీ ఆమె గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ స్నేహితురాలు శివానీ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సందర్భంగా ఐష్‌ కాలేజ్‌ క్రష్‌ గురించి కూడా చెప్పింది శివానీ.
undefined
ఈ సందర్భంగా శివానీ మాట్లాడుతూ.. `నేను ముంబై జై హింద్‌ కాలేజ్‌లో సైన్స్ చదివేదాన్ని. ఐశ్వర్య మా కాలేజ్‌కు దగ్గరగా ఉన్న కేసీ కాలేజ్‌లో చదివేది. ఆ టైంలో కేవలం ఐష్‌ను చూడటానికే మా కాలేజ్‌ బాయ్స్ ఐష్ కాలేజ్‌ గేట్‌ ముందు ఎదురుచూసేవారు` అని చెప్పింది.
undefined
ఆ సమయంలో ఐష్‌ మాత్రం తన ఫిజిక్స్‌ ప్రొఫెసర్‌ను ఎట్రాక్ట్‌ చేయడానికి నానా తంటాలు పడేదట. ఆ కాలేజ్‌లో అతనే అందరి కంటే స్ట్రిక్ట్‌ గా ఉండేవాడు. అందుకే అతడిని తన దృష్టిలో పడేందుకు ఐష్ ప్రయత్నించేదట,. ఎప్పుడూ చివరి బెంచ్‌లో కూర్చునే ఐష్‌, ఫిజిక్స్‌ క్లాస్‌ మాత్రం ఫస్ట్ బెంచ్‌లో కూర్చునేదట.
undefined
ఆ టైంలో ఐష్‌ ఓ సాధారణ ప్రయాణికురాలిగా లోకల్‌ ట్రైన్‌లో ట్రావెల్‌ చేసేదట. అందరికంటే ఆలస్యంగా క్లాస్‌లోకి వచ్చే ఐష్ ఎప్పుడూ చివరి బెంచ్‌లో కూర్చునేదని చెప్పింది శివానీ.
undefined
ఐశ్వర్య ఆర్కిటెక్ట్ కావాలని కోరుకుంది. కానీ కాలేజ్‌లో లెక్చరర్స్‌ అంతా ఆమెను మోడలింగ్ మీద దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫిజిక్స్‌ లెక్చరర్‌ ఓ మేగజైన్‌ ఫోటో షూట్‌ లో పాల్గొనాలని ఐష్‌కు సూచించాడు.
undefined
కాలేజ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్‌గా పేరు తెచ్చుకున్న ఐష్‌, తరువాత 1994లో మిస్‌ వరల్డ్‌ కిరీటం గెలుచుకొని సత్తా చాటింది.
undefined
click me!