నిర్మాతతో సీరియల్ నటి వివాహం.. తెగ వైరల్ అవుతున్న ఫోటోస్

First Published Sep 2, 2022, 2:21 PM IST

చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికర జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రముఖ తమిళ సీరియల్ నటి విజె మహాలక్ష్మి.. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ని వివాహం చేసుకున్నారు.

చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికర జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రముఖ తమిళ సీరియల్ నటి విజె మహాలక్ష్మి.. నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ ని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక ఇటీవల తిరుపతిలో ఘనంగా జరిగింది. ఆ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 

మహాలక్ష్మి తమిళ సీరియల్స్ లో నటించి పాపులర్ అయ్యారు. ఆఫీస్, చెల్లమాయ్, ఉతిరిపూక్కల్, ఒరు కై ఒసై, వాణి రాణి లాంటి సీరియల్స్ మహాలక్ష్మికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. మహాలక్ష్మి సినిమాల్లో కూడా నటిస్తోంది. 

అయితే మహాలక్ష్మికి ఇది రెండవ వివాహం. గతంలోనే ఆమెకి వివాహం జరిగింది. మొదటి భర్త నుంచి విడిపోయింది. సినిమాల్లో నటించడం ప్రారంభించాక నిర్మాత రవీందర్ తో పరిచయం ఏర్పడింది. ఆసక్తికర విషయం ఏంటంటే రవీందర్ కి కూడా ఇది రెండవ వివాహమే. ఆయన కూడా తన మొదటి భార్య నుంచి విడిపోయారు. ఇద్దరూ సింగిల్ గా ఉండడంతో పరిచయం ప్రేమగా మారింది. 

అలా ఈ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో తిరుపతిలో వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ప్రస్తుతం రవీందర్ నిర్మిస్తున్న రెండు చిత్రాల్లోనూ మహాలక్ష్మి నటిస్తున్నారు. 

వివాహం తర్వాత మహాలక్ష్మి పెళ్లి ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నీవు నా జీవితంలో ఉండడం నా అదృష్టం. నీ ఆప్యాయతతో నా లైఫ్ ని సంపూర్ణం చేస్తున్నావు. లవ్యూ అమ్ము అంటూ మహాలక్ష్మి పోస్ట్ చేసింది. 

వీరిద్దరి ఫోటోలు నెటిజన్లని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీనితో సోషల్ మీడియాలో వీరి వెడ్డింగ్ ట్రెండింగ్ గా మారింది. అయితే మహాలక్ష్మి డబ్బున్న నిర్మాతని వివాహం చేసుకుందని కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొందరు కొత్త జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. 

click me!