చిరు, బాలయ్య, వెంకటేష్,నాగార్జున అందరూ దొంగలే అంటూ.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..?

First Published Sep 22, 2022, 5:52 PM IST

టాలీవుడ్ రాములమ్మ విజయశాంతి సంచల వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ సీనియర్ హీరోలను ఉద్దేశించి  హాట్ కామెంట్స్ చేశారు. అయితే ఇవి ఎప్పుడ చేసిన కామెంట్స్ అయినా.. ఈమధ్య ఆమె మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..?

లేడీ సూపర్ స్టార్.. టాలీవుడ్ లేడీ అమితాబచ్చన్ గా పేరుతెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. అటు సినిమాలు.. ఇటు రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తున్న విజయశాంతి.. సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భారీ రెమ్మూనరేషన్, కథలో ఇంపార్టెన్స్ ఉంటేనే నటిస్తానని చప్పేసిందట. అంతే కాదు.. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా ఛాన్స్ లు వచ్చినా వద్దనుకుంది విజయశాంతి రాజకీయాల మీదే ఫోకస్ పెట్టింది. 

1979లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. వరుసగా పెద్ద హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ సరసన మెరిసింది. చిరుతో ఎక్కువ సినిమాలు చేసింది విజయశాంతి. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తరువాత పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్న ఈమె.. ఓ సందర్భంలో ఈ హీరోలందరిని దొంగలుగా తేల్చిపదేసింది. ఇంతకీ కారణమేంటి...
 

మీబ్యాచ్ హీరోల గురించి చెప్పండి అని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా గతంలో విజయశాంతిని ప్రశ్నించగా..రాములమ్మ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. నా బ్యాచ్ హీరోలంతా ముసుగు వేసుకున్న దొంగలు.. వాళ్లు తీసుకున్న రెమ్యూనరేషన్ లో కనీసం 20 శాతం కూడా ప్రజల కొరకు ఖర్చు చేయడం లేదని.. వారు సినిమాల్లో మాత్రమే హీరోలు కానీ, బయట కాదు అన్నట్టుగా  మాట్లాడింది.

రాజకీయాల్లో ఉన్న తనకు ప్రజలు దండేసి అభినందిద్దాం అని అనుకునే ఒక్క హీరో కూడా కనిపించలేదు అన్నది విజయశాంతి. అంతే కాదు తెలగాణ ఉద్యమం సమంయంలో.. మన రాష్ట్రానికి అన్నయం జరుగుతోంది.. సపోర్ట్ చేయండి అని అంటే..ఎవరూ ముందుకు రాలేదు అంటూ చెప్పుకొచ్చింది రాములమ్మ.

తాను అనుకుంటే ఎప్పుడో కేంద్రమంత్రి అయ్యేదానని.. కాని తనకు ప్రజాసేవ ముఖ్యం.. కష్టపడి సాధించినదానితోనే సంతోషంగా ఉంటాను. జనాలకోంస కష్టపడటం అంటేఇష్టమంటోంది. ఇక సినిమాల విషయంలో ఏ ఆలోచన లేదంటోంది. అప్పటికప్పుడే ఏది అనిపిస్తే అది చేసే ఆలోచనలో ఉంది విజయశాంతి. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయనంటోంది...?అసలు సినిమాల మీద అసలు ఇంట్రెస్ట్ లేనే లేదంటోంది సీనియర్ స్టార్. 

click me!