‘షోలే’లో అమితాబ్ లాంటి రోల్ అని.. చివరికి చంపేశాడు.. బోయపాటిపై వేణు తొట్టెంపూడి సంచలన వ్యాఖ్యలు..

Published : Jul 28, 2022, 07:03 PM ISTUpdated : Jul 28, 2022, 08:35 PM IST

కొన్నేండ్లుగా నటుడు వేణు తొట్టెంపూడి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఎట్టకేళలకు రీఎంట్రీ ఇస్తుండగా.. తాజాగా తను నటించిన చివరి సినిమా దర్శకుడు బోయపాటి శ్రీనుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

PREV
15
‘షోలే’లో అమితాబ్ లాంటి రోల్ అని.. చివరికి చంపేశాడు.. బోయపాటిపై వేణు తొట్టెంపూడి సంచలన వ్యాఖ్యలు..

దాదాపు పదేండ్ల తర్వాత మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటిస్తున్న చిత్రం ‘రామరావు ఆన్ డ్యూటీ’తో టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు నటుడు వేణు తొట్టెంపూడి (Venu Thottempudi). ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నారు. 
 

25

విడుదల దగ్గరపడుతుండటంతో Rama Rao On Duty చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. స్టార్ కాస్ట్ కూడా వరు ఇంటర్వ్యూలతో సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ మూవీతోనే రీఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ‘దమ్ము’ సినిమా పై స్పందిస్తూ దర్శకుడు బోయపాటిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

35

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ‘దమ్ము’. ఇంటర్వ్యూలో ఈ చిత్రంలో వేణు పాత్రపై స్పందిస్తూ..  Boyapati Srinu తనను దమ్ము సినిమాలో ‘షోలే’లో అమితాబ్ లాగా చూపిస్తానని చెప్పారంట. కానీ చివరికి షోలేలో అమితాబ్ పాత్ర చనిపోయినట్టుగానే ‘దమ్ము’లో తన పాత్రను చంపేశారన్నారు. 
 

45

తను ఊహించుకున్నట్టుగా బోయపాటి శ్రీను తన పాత్రను తెరకెక్కించలేదని కాస్తా సెటైరికల్ గా కామెంట్ చేశారు. అలాగే దమ్ము చిత్రం తర్వాత మరో సినిమా చేసిన ఆయన.. తన బిజినెస్ లపై ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు. దీంతో తొమ్మిదేండ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం వ్యాపారాలన్నీ సక్రమంగా కొనసాగుతుండటంతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 

55

అయితే కరోనా సమయంలో ఓటీటీ కంటెంట్స్, వెబ్ సిరీస్ లు చూస్తుండగా.. మళ్లీ సినిమాలపై ఆసక్తి కలిగిందన్నారు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ చేయాలని వచ్చాడని, ఫన్ బకెట్ వాళ్ళతో ఓ సినిమా లీడ్ రోల్ ఒకే అయింది. అలాగే మరో సినిమా లీడ్ రోల్ కూడా  ఒకే అయింది.. అప్పుడే ‘రామా రావు ఆన్ డ్యూటీ’లోనూ అవకాశం రావడంతో  వెంటనే రవితేజతో కలిసి నటించానని తెలిపారు. మూవీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

click me!

Recommended Stories