తర్వాత మళ్లీ తనే నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా అని అడుగుతాడు. ఇందులో ఆశ్చర్యపోవటానికి ఏముంది, ధరణి మేడమ్ చేసినట్లుగా మెసేజ్ చేసి తెలుసుకున్నారు కదా అంటుంది వసుధార. నీకు ఎలా తెలుసు అంటాడు శైలేంద్ర. భర్త గురించి చెడుగా చెప్పేంత చెడ్డది కాదు మా ధరణి మేడం, అయినా ఆవిడకి మేము ఎక్కడ ఉన్నామో తెలుసు అంటుంది. కోపంతో ఊగిపోతాడు శైలేంద్ర, నాకు దక్కని ఎండి సీట్ మరెవరికీ దక్కకూడదు. డిబిఎస్టీ కాలేజీని నాశనం చేసేస్తాను అంటాడు.