లెహంగా వోణీలో మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి.. నడుమందాలు, మతిపోయే పోజులతో కవ్విస్తున్న బుల్లితెర బ్యూటీ.!

First Published Sep 30, 2022, 6:49 PM IST

బుల్లెతెర బ్యూటీ వర్షిణి సౌందరరాజన్  (Varshini Soundarajan) తాజాగా లెహంగా, చోళీలో దర్శనమిచ్చింది. బొద్దుగా మారిన వర్షిణి ట్రెడిషనల్ లుక్ లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.
 

బుల్లితెర బ్యూటీ టీవీ ఆడియెన్స్,  యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ వర్షిణి సౌందరరాజన్. హైదరాబాద్ కు చెందిన ఈ తెలుగు బ్యూటీ.. ఇన్నాళ్లు బుల్లితెరపై అలరించిన విషయం తెలిసిందే.

కొన్నాళ్లుగా స్మాల్ స్క్రీన్ పై కనిపించని వర్షిణి వెండితెరపై అలరించబోతుంది. స్టార్ హీరోయిన్ సమంత (Samantha) నటిస్తున్న భారీ చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam)లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. 
 

ఇప్పటికే  ఈ బ్యూటీ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’లో తన పాత్రకు సంబంధించిన షూట్ ను ప్రారంభించింది. అందుకే బుల్లితెరపై పెద్దగా సందడి చేయడం లేదు యాంకర్ వర్షిణి. దీంతో ఆమె అభిమానులు కాస్తా అప్సెట్ అవుతున్నారు. 

ఈ క్రమంలో వర్షణి సోషల్ మీడియాలో మాత్రం ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంటోంది. సినీ కబుర్లను చెబుతూ వారికి మరింత దగ్గరవుతోంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లోనూ వర్షిణి ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. 
 

ఈ క్రమంలో తాజాగా లెహంగా వోణీలో ఫొటోషూట్ చేసింది. ఎల్లో దుస్తుల్లో వర్షిణి మరింతగా మెరిసిపోతోంది. గతంతో పోల్చితే కాస్తా బొద్దుగా మారిన ఈ ముద్దుగుమ్మ  ట్రెడిషనల్ లుక్ లో ఆకర్షణీయంగా తయారైంది.  తాజాగా తను పంచుకున్న ఫొటోల్లో సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి ఆకట్టుకుంటోంది.
 

లేటెస్ట్ ఫొటోలను చూసిన నెటిజనులు మంత్రముగ్ధులవుతున్నారు. యంగ్ బ్యూటీ అందాల విందుకు ఫిదా అవుతున్నారు. నడుమందాలతో మతిపోగొడుతున్న వర్షణి గ్లామర్ ను పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. 

టాప్ టు బాటమ్ అన్ని యాంగిల్లో అందాలు ఆరబోసిన వర్షిణి సౌందరరాజన్ ను ఇంటర్నెట్ ఫ్యాన్స్ మరింత ఎంకరేజ్ చేస్తున్నారు. ఆ పెడుతున్న పోస్టులను వైరల్ చేస్తున్నారు. బుల్లితెర బ్యూటీకి కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం వర్షణి పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. 
 

గతంలోనే హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినా వర్షిణి టీవీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’,‘శ్రీ రామరక్ష’ వంటి చిత్రాల్లో నటించింది. చివరిగా ‘మళ్లీ మొదలైంది’ చిత్రంతో ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత మరిన్ని ఆఫర్లు అందుకోవడం ఖాయమంటున్నారు. 
 

click me!