తాను `ట్రాన్సఫర్ త్రిమూర్తులు` సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడంపై వడ్డే నవీన్ స్పందిస్తూ, తన రీఎంట్రీ ఎలివేషన్లు, యాక్షన్తో సినిమా చేయాలని అనుకోలేదు, అలా చేస్తే, ఆడియెన్స్ కి తాను రీచ్ కాలేదు. పెద్ద పెద్ద పాత్రలు పెట్టినా వెంటనే ఆడియెన్స్ సొంతం చేసుకోలేరు, అదే కానిస్టేబుల్ అంటే అంతా హోన్ చేసుకుంటారు. ఈజీగా వారికి కనెక్ట్ అవుతాం. తాను గతంలోనూ ఇలాంటి పాత్రలు, ఇలాంటి సినిమాలే చేశాను, ఇప్పుడు కూడా అదే స్టయిల్లో రావాలని చెప్పి ఈ సినిమా చేశానని, సాధారణ కానిస్టేబుల్.. తన ఫ్యామిలీ కోసం ఎలా నిలబడ్డాడు, ఎలా పోరాడనేది కథాంశంతో ఈ సినిమా సాగుతుంది, అందరికీ కనెక్ట్ అవుతుందని తెలిపారు వడ్డే నవీన్.