ప్రస్తుతం గోల్డెన్ లెగ్గా, మరోవైపు క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కృతిశెట్టి స్టార్గా బోర్న్ అయ్యింది `ఉప్పెన` చిత్రంతో అనే విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతి హీరోయిన్గా ఈ చిత్రంతోనే పరిచయం కాగా, బుచ్చిబాబు దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం ఇరవై కోట్లతో రూపొంది, ఏకంగా వంద కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను, నిర్మాతలను, ట్రేడ్ వర్గాలను, చివరికి ఆడియెన్స్ ని సైతం షాక్కి గురి చేసింది.