రామ్ చరణ్ బర్త్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉపాసన... బేబీ బంప్ రివీల్ చేస్తూ సందడి చేసిన స్టార్ వైఫ్!

First Published Mar 28, 2023, 4:52 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే (మార్చి 27) వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగాయి. ఈ వేడుకలో స్టార్ కపుల్ చరణ్-ఉపాసన డిజైనర్ వేర్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 

Ram Charan


భర్త రామ్ చరణ్ బర్త్ డే వేడుక కోసం ఉపాసన స్కై బ్లూ కలర్ బాడీ కాన్ డ్రెస్ ధరించారు. ఈ డ్రెస్ బిగుతగా ఉన్న తరుణంలో ఆమె బేబీ బంప్ క్లియర్ గా రివీల్ అయ్యింది. ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 12న చిరంజీవి ఈ స్వీట్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు. ఉపాసన తల్లి అయ్యారని, త్వరలో మెగా వారసుడు దిగుతున్నాడని వెల్లడించారు. 

Ram Charan

ఉపాసన-రామ్ చరణ్ లకు వివాహమై పదేళ్లు దాటిపోగా ఈ వార్త ఆనందంలో ముంచివేసింది. మెగా అభిమానులు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకున్నారు. 2012లో చరణ్-ఉపాసన ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలను ఒప్పించి బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. 
 

Ram Charan

రామ్ చరణ్ తండ్రి కాబోతుండగా, ఆయన నటించిన ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకుంది. ఆయనకు ఈ బర్త్ డే చాలా ప్రత్యేకం. అందుకే గ్రాండ్‌గా బర్త్ డే పార్టీ నిర్వహించారు. ఈ వేడుకలో  న‌టీన‌టులు, టాలీవుడ్ సెల‌బ్రిటీలు స‌హా ప‌లువురు హాజ‌ర‌య్యారు. రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న స‌తీమ‌ణి ఉపాసన ఈ కార్య‌క్ర‌మాన్ని హోస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లోని చిరంజీవి ఇంట్లో ఈ బ‌ర్త్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. టాలీవుడ్ ప్రముఖులు  విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విక్ట‌రీ వెంకటేష్, రానా ద‌గ్గుబాటి పాల్గొన్నారు. ఇంకా అక్కినేని నాగార్జున‌, అమ‌ల‌, నాగ చైత‌న్య‌, అఖిల్ ఫంక్ష‌న్‌కి అటెండ్ అయ్యారు. 
 


ఇంకా అడివి శేష్‌, నిఖిల్ సిద్ధార్థ్‌, వైష్ణ‌వ్ తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ కృష్ణ వంశీ, నిర్మాత‌లు అల్లు అర‌వింద్‌, దిల్ రాజు త‌దిత‌రులు కూడా విచ్చేశారు.రామ్ చ‌ర‌ణ్‌తో మంచి అనుబంధం ఉండే  ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, కె.జి.య‌ఫ్ సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ వంటి స్టార్ డైరెక్ట‌ర్స్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన్నారు. 
 

రాజ‌మౌళి స‌హా RRR టీమ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఎం.ఎం.కీర‌వాణి, నిర్మాత డి.వి.వి.దాన‌య్య‌, సినిమాటోగ్ర‌ఫీర కె.కె.సెంథిల్ కుమార్‌, , ఎస్‌.ఎస్‌.కార్తికేయ‌, రాహుల్ సిప్లిగంజ్‌, కాల భైర‌వ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. మార్చిలో జ‌రిగినే ఆస్కార్ ఈవెంట్‌ తర్వాత ఈ టీమ్ ఇప్పుడే ఒకేసారి వేదిక‌పై క‌నిపించింది. తొలి ఆస్కార్ అవార్డును గెలిచి మ‌న దేశానికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన RRR టీమ్‌ను మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా స‌త్క‌రించారు.అతిథుల‌కు ఇండియ‌న్, కాంటినెంట‌ర్ వంట‌కాల‌ను ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి స‌ర్వ్ చేశారు.
 

click me!