బిగ్‌ బాస్‌ తెలుగు 8 కంటెస్టెంట్లలో పారితోషికం ఎవరికి ఎక్కువిస్తున్నారో తెలుసా? ఆ ఇద్దరు ఎందుకు స్పెషల్‌?

First Published Oct 6, 2024, 6:47 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 8లో కంటెస్టెంట్లకి సంబంధించిన పారితోషికం వివరాలు లీక్‌ అయ్యాయి. ముఖ్యంగా ఆ ఇద్దరు కంటెస్టెంట్లకి మాత్రం గట్టిగానే ఇస్తున్నారట. వాళ్లెవరు?

Bigg boss telugu 8

బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌  విజయవంతంగా ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే హౌజ్‌ నుంచి ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్‌ అయ్యారు. నేడు మరో కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కాబోతున్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌ ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆదివారం నైనిక హౌజ్‌ని వీడుతున్నట్టు సమాచారం. అదే సమయంలో ఈ ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ ఉండబోతున్నాయి. ఎనిమిది మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంద కంటెస్టెంట్లు ఉండగా, వీరికి మరో ఎనిమిది మంది తోడు కాబోతున్నారు. 16 మందితో మళ్లీ హౌజ్‌ కళకళలాడబోతుందని చెప్పొచ్చు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అయితే ప్రస్తుతం మాత్రం హౌజ్‌లో నిఖిల్‌, విష్ణుప్రియా, యష్మి, ప్రేరణ, నాగమణికంఠ, నబీల్‌, కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌ కంటెస్టెంట్లుగా ఉన్నారు. మరి వీరి పారితోషికాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలు లీక అయ్యాయి. ఇప్పుడున్న వారిలో ఎవరికి ఎక్కువ పారితోషికాలు ఇస్తున్నారనేది తెలిసింది. ముఖ్యంగా ఇద్దరు కంటెస్టెంట్లకి మాత్రం గట్టిగానే పారితోషికం ఇస్తున్నారట. మరి ఆ ఇద్దరు ఎవరు అనేది చూస్తే,
 

Latest Videos


బిగ్‌ బాస్‌ తెలుగు 8 లో పారితోషికం రోజు వారి లెక్క ప్రకారం ఉంటుంది. తక్కువలో తక్కువ రోజుకి పదిహేను వేల వరకు ఇస్తారు. వారం లెక్కన కౌంట్‌ ఉంటుంది. ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలకు కలిపి రెమ్యూనరేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం ఉన్న వారిలో తక్కువగా నాగమణికంఠకి, నబీల్‌లకు ఇస్తున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌లకు యావరేజ్‌గా ఉందని, ప్రేరణ, యష్మిలకు బాగానే ఉందని, కానీ నిఖిల్‌, విష్ణు ప్రియాలకు గట్టిగానే ఇస్తున్నారట. చాలా డిమాండ్‌ మేరకు వీళ్లు బిగ్‌ బాస్‌ షోకి వచ్చినట్టు తెలుస్తుంది. 
 

నాగమణికంఠ, నబీల్‌లు సోషల్‌ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లు. వీరికి రోజుకి ఇరవై వేలలోపే ఉంటుందట. అలాగే కిర్రాక్‌ సీత, పృథ్వీరాజ్‌లకు ఇరవై ఐదు వేల వరకు ఉంటుందని, యష్మి, ప్రేరణ టీవీ ఆర్టిస్టులు. వీరికి రోజుకి సుమారు 35 వరకు ఇస్తారని తెలుస్తుంది. వీరికి తక్కువ పేమెంట్స్ ఉంటున్నాయని సమాచారం. బుల్లితెరపై సందడి చేస్తున్న వీరికి ఉన్నంతలో బెటర్‌గానే పారితోషికం అందుతుందని తెలుస్తుంది. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు కూడా రోజుకి ముప్పై వేల వరకు అందుకున్న కంటెస్టెంట్లే కావడం విశేషం. 
 

అయితే హౌజ్‌లో నిఖిల్‌, విష్ణుప్రియా మాత్రం స్పెషల్‌గా నిలుస్తున్నారు. వీరికి ఒక్కో రోజుకి యాభై వేలవరకు పారితోషికం తీసుకుంటున్నారట. విష్ణు ప్రియా గత సీజన్‌లోనే బిగ్‌ బాస్ కి రావాలని నిర్వాహకులు అడిగారు. తనకు రోజుకి 70వేలు ఇస్తే వస్తా అని చెప్పింది. దీంతో సైలైంట్‌ అయ్యారు. ఈ సారి మరోసారి ఆమెని అప్రోచ్‌ అయ్యారని, అయితే ఈ సారి దిగొచ్చిందట. తనకు పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో ఎంతో కొంతకి ఓకే చెప్పిందట. ఈ క్రమంలో ఆమెకి రోజుకి 45-50వేల వరకు పారితోషికం ఇస్తున్నారట.

అలాగే నిఖిల్‌ పారితోషికం కూడా నాలభై వేలకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. సీరియల్‌ నటుడిగా నిఖిల్‌కి మంచి క్రేజ్‌ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగానే రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ఇది. ఇందులో నిజమెంతా అనేది వాళ్లు తెలియజేస్తేనే తెలుస్తుంది. సెప్టెంబర్‌ 1న 14 మందితో ప్రారంభమైన బిగ్‌ బాస్‌ తెలుగు 8వ సీజన్‌ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇప్పటి వరకు బేబక్క, శేఖర్‌ బాషా, అభయ్‌ నవీన్‌, సోనియా, ఆదిత్య ఓం ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. 

ఇంట్లోనేమో ఎన్టీఆర్‌ ఫోటో పెట్టుకుని అరాధిస్తాడు.. ఆయన రిక్వెస్ట్ చేస్తే మొహంమీదే నో చెప్పిన హీరో ఎవరో తెలుసా?
 

click me!