Guppedantha Manasu 25th March Episode:అమ్మ జోలికి వస్తే చంపేస్తా మను వార్నింగ్, మను కుంతీ పుత్రుడా?

First Published Mar 25, 2024, 10:07 AM IST

ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు.
 

Guppedantha Manasu


Guppedantha Manasu 25th March Episode:శైలేంద్ర రాజీవ్ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనుపమకు ఎలా ఉంది అని రాజీవ్ అడుగుతాడు. ఎందుకు వెళ్లి.. పండ్లు ఇచ్చి పలకరించి వస్తావా  అని శైలేంద్ర అడుగుతాడు. కాదని.. ఆమె కండిషన్ ని పట్టి... మనుగాడి మెంటల్ స్టేజ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు కదా అని రాజీవ్ అంటాడు. దానికి శైలేంద్ర పర్వాలేదు.. నీకు కూడా  బుర్ర బాగానే పని చేస్తోంది అని అంటాడు. ఈలోగా వాళ్ల మీదకు కారు దూసుకువస్తుంది. ఏంటా అని భయపడతారు.

Guppedantha Manasu

అందులో నుంచి మను కోపంగా బయటకు వస్తాడు. వచ్చీ రావడమే తుపాకీ బయటకు తీసి.. మా అమ్మ మీద ఎటాక్ చేయించింది ఎవరు అని అడుగుతాడు. మీ అమ్మ ఎవరు బ్రదర్ అని రాజీవ్ ఏమీ తెలియనట్లుగా నాటకం ఆడతాడు. అప్పుడు శైలేంద్ర... అనుపమగారు వాళ్ల అమ్మని, ఆమె పై ఎటాక్ జరిగిందని చెబుతాడు. ఆ విషయం నిజంగా నాకు తెలీదు అని రాజీవ్ చాలా అమమాయకంగా నటిస్తాడు. అయితే.. శైలేంద్ర కూడా.. అనుపమగారిపై ఎటాక్ జరిగిన తర్వాతే.. ఆవిడ మీ అమ్మ అని తెలిసిందని చెబుతాడు.

Guppedantha Manasu

అయితే.. మీ నాటకాలు నాకు తెలుసు అని.. మీరు నా మీద ఎటాక్ చేయిస్తే.. మా అమ్మ అడ్డు వచ్చింది అని మను అంటాడు. దమ్ముంటే.. నాతో మీరు నాతో శత్రరుత్వం పెట్టుకోమని.. మా అమ్మ జోలికి వస్తే మాత్రం ఊరుకోను అని సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. తాను కాలేజీ చదివే సమయంలో.. ఒకడు ర్యాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి వాళ్ల అమ్మ కాలికి చిన్న గాయం చేశాడని... తర్వాత వాడు.. హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని చెబుతాడు. ఇప్పుడు ఏకంగా మీరు.. మా అమ్మ రక్తం కళ్ల చూశారు.. మిమ్మల్ని వదిలిపెట్టను.. జస్ట్ మీ మీద అనుమానం వస్తేనే ఇలా బెదిరించాను.. అదే మీరే చేయించారు అని తెలిస్తే మాత్రం.. ఊరుకోను.

Guppedantha Manasu

ఎటాక్ చేసినోడు ఎవరు.. దాని వెనక ఉంది ఎవరు అన్ని విషయాలు ఎంక్వేరీ చేయిస్తాను. అప్పుడు మీ సంగతి చెబుతాను అని వార్నింగ్ ఇస్తాడు. అయితే.. శైలేంద్ర, రాజీవ్ మాత్రం.. తమకు ఏమీ తెలియనట్లు నటిస్తారు. మను అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత... వామ్మో..మను గాడికి నిజం తెలిస్తే.. కష్టం అని భయపడతారరు. కానీ.. ఆలోగా... మను ని ఫినిష్ చేయాలని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu

ఇక.. అనుపమను చూడటానికి దేవయాణి వస్తుంది. రావడం రావడమే.. ఏదో అనుపమ మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ.. ప్రేమ కారిపోతున్నట్లుగా మాట్లాడుతుంది. ఆమె మాట్లాడే ప్రతిమాటకు.. ఏంజెల్ కౌంటర్ ఇస్తూ ఉంటుంది. ఈ ఏంజెల్ ఉంటే.. అనుపమను ఏడిపించలేమని, ఏంజెల్ ని పక్కకు పంపించాలని అనుకుంటుంది. కాఫీ వంకతో పంపించేస్తుంది.

Guppedantha Manasu


తర్వాత.. అనుపమతో మాట్లాడుతుంది. మను నీ కొడుకే అంట కదా.. నాకు ఇప్పుడే తెలిసింది అని అంటుంది. మరి, మను తండ్రి ఎవరు..? అని అడుగుతుంది. అనుపమ సమాధానం చెప్పకుండా ఆగిపోవడంతో.. కొంపదీసి.. మను కుంతీ పుత్రుడు కాదు కదా అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.

click me!