కానీ, అదే సమయానికి కళ్యాన్ వస్తాడు. తనకు కూడా కాఫీ ఇవ్వమని అంటాడు. ఇస్తుంది. అది తాగిన తర్వాత.. అది ఎంత కమ్మగా ఉందో.. కళ్యాన్ చెబుతాడు. అనామిక నమ్మదు.అందరూ బాగుంది అన్నారు అని అంటుంది. కావాలంటే.. నువ్వే టేస్ట్ చెయ్యి అని కళ్యాణ్ అంటాడు. తాగిన తర్వాత.. అది ఎంత కమ్మగా ఉందో.. అనామికకు అర్థమౌతుంది. ఛండాలంగా ఉంది అంటుంది. తనకు కాఫీ పెట్టడం రాదు అని అర్థమైంది అంటుంది. ఈ పనులు చేయడానికి కావ్య ఉంది లే అని ఇందిరా దేవి అంటుంది. మళ్లీ.. అందరూ కావ్యను కాఫీ ఇవ్వమని అడుగుతారు.
వెంటనే రుద్రాణి.. నువ్వేమీ బాధపడకు అనామిక. నువ్వు గారాభంగా పెరిగావ్ కదా.. ఈ పనులు ఎలా వస్తాయి. కావ్య, స్వప్న అంటే.. పేదరికంలో పెరిగారు కాబట్టి.. ఈ పనులు వాళ్లకు వస్తాయి అని అంటుంది. వెంటనే స్వప్న కలగజేసుకొని.. నేను కూడా మా ఇంట్లో గారాభంగా పెరిగాను అని అంటుంది. రుద్రాణి, స్వప్న గొడవ మొదలౌతుంి. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
కమింగ్ అప్ లో రాజ్ , శ్వేత తో కలిసి రోడ్డు మీద ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. అది కావ్య కంట పడింది. ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు అని అడిగితే... ఆఫీసులో ఉన్నాను అని చెబుతాడు. అబద్ధం ఎందుకు చెబుతున్నాడా అని కావ్యలో అనుమానం మొదలౌతుంది.