BrahmaMudi 1st April Episode: రాజ్ ని కోర్టుకు లాగుతానన్న కనకం, కళ్లు తెరిపించిన కావ్య..!

First Published Apr 1, 2024, 9:58 AM IST

ఈ రోజు ఇలా కాంప్రమైజ్ అయిపోయి.. బొమ్మలు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నావా..? ఈ పుట్టింటివారు లేరని అనుకున్నావా తల్లి అని బాధగా అడుగుతాడు. 

Brahmamudi


BrahmaMudi 1st April Episode: కావ్య బాబు కోసం బొమ్మలు కొనుక్కొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎదురుగా.. కనకం, మూర్తి కనపడతారు. వెంటనే కావ్య చేతిలో బొమ్మలు చూసి షాకౌతారు. సవతి కొడుకు కోసం బొమ్మలు కొనుక్కొని వెళ్తున్నావా అంటూ కనకం ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మూర్తి కూడా అంతే ఏమోషనల్ గా మాట్లాడతాడు. నీ భర్త బిడ్డను తీసుకువచ్చిన రోజే.. నువ్వు కూడా ఇంటికి వచ్చేయమని చెప్పాను కదమ్మా.. ఎందుకు రాలేదు..? ఈ రోజు ఇలా కాంప్రమైజ్ అయిపోయి.. బొమ్మలు కొనుక్కొని తీసుకొని వెళ్తున్నావా..? ఈ పుట్టింటివారు లేరని అనుకున్నావా తల్లి అని బాధగా అడుగుతాడు. 

Brahmamudi

ఇక.. కనకం అయితే రెచ్చిపోతుంది. నువ్వు పుట్టింటికి వచ్చేయమని.. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదు చేద్దామని, కోర్టుకు లాగుదామని, మహిళా సంఘాలను పిలిచి రచ్చ చేద్దామని అంటుంది. ఆ మాటలకు కావ్య రివర్స్ అయిపోతుంది. ఎందుకమ్మా.. ఆయన మన ఇల్లు అప్పులో ఉన్నప్పుడు తీర్చినందుకు ఆయన పరువు తీయాలా..? నీ పెద్ద కూతురు పెళ్లి పీటల మీద నుంచి పారిపోతే... నేను ముసుగేసుకొని కూర్చున్నా.. తాళి కట్టునందుకు ఆయనను కోర్టు కి ఎక్కించాలా..? నేను పుట్టింటికి సహాయం చేయడానికి డబ్బులు తీసుకోవడానికి మొహమాట పడితే ఆయనే స్వయంగా వచ్చి బొమ్మలకు రంగులు వేసిందుకు శిక్షించాలా..? బొమ్మలను దొంగలు ఎత్తుకుపోతే ప్రాణాలకు తెగించి.. వాటిని తీసుకువచ్చిందేకు శిక్షించాలా..? నీ పెద్ద కూతురిపై కులత అనే ముద్ర పడినప్పుడు.. అది తొలగించడానికి నాతో పాటు కష్టపడినందుకు పరువు తీయాలా..? ఎందుకు చేయాలో చెప్పమ్మా అని అడుగుతుంది. మీకు మంచి చేసినప్పుడు అల్లుడు దేవుడు అవుతాడు.. కష్టం తెచ్చినప్పుడు  శిక్షించాలా అని అడుగుతుంది.

Brahmamudi

నిజంగానే అల్లుడు దేవుడేనమ్మా.. కానీ.. ఇఫ్పుడు నీకు మాత్రం కష్టం తెచ్చాడు కదా అని మూర్తి అడుగుతాడు. అప్పుడు.. ఇప్పటి వరకు ఒక్క తప్పు కూడా చేయని ఆయన ఈ తప్పు చేశారంటే ఎలా నమ్మాలి అని అడుగుతుంది. ఎదుటివారు తప్పు చేసినా వారి కోణంలో ఆలోచించి.. క్షమించే గుణం ఆయనదని, ఇప్పటికే ఇంట్లో వాళ్లంతా ఆయనను వెలివేశారు అని చెబుతుంది. 

Brahmamudi


కేవలం.. ఆయన తప్పు చేయరనే నమ్మకంతోనే తాను అక్కడ ఉంటున్నానని.. నిజం తెలుసుకునే పనిలో ఉన్నాను అని చెబుతుంది. నిజంగానే.. ఆయన తప్పు చేశారని.. మరో స్త్రీతో ఆ బిడ్డను కన్నారు అని తెలిసిన క్షణం..తాను ఇక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండను అని.. పుట్టింటికే వస్తాను అని చెబుతుంది. అయితే.. అప్పుడు కూడా ఆయనపై కోర్టుకి ఎక్కను అని.. ఆయన పరువు కూడా తీయనని.. కాకపోతే.. తన మనుసులో ఇక తన భర్తకు స్థానం ఉండదు అని చెబుతుంది. కూతురు చెప్పిన మాటలకు కనకం, మూర్తిలకు కళ్లు తెరుచుకుంటాయి. నిజంగానే రాజ్ తప్పు చేసి ఉండడు అనే కోణంలో పాజిటివ్ గా ఆలోచించడం మొదలుపెడతారు. అలానే ఇంటికి వెళ్లిపోతారు. ఇక.. కావ్య.. వాటితోనే ఇంటికి చేరుకుంటుంది.

click me!