బిగ్ బాస్ తెలుగు 7 గత ఏడాది డిసెంబర్ లో ముగిసింది. సీజన్ 6 అట్టర్ ప్లాప్ కాగా సీజన్ 7 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యారు. కంటెస్టెంట్స్ అదిరిపోయే కంటెంట్ ఇచ్చారు. దీంతో షో సక్సెస్ అయ్యింది.
పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే శివాజీ టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యాడు. చివరి వారాల్లో సమీకరణాలు మారాయి. శివాజీకి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ రేసులో దూసుకొచ్చాడు.
Bigg Boss Telugu 7
శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఒకరు విన్నర్ అంటూ ప్రచారమైంది. అనుకున్నట్లే ఈ ముగ్గురు టాప్ 3లో నిలిచారు. శివాజీ మూడో స్థానంలో నిలిచాడు. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకున్నాడు.
కాగా సీజన్ 8 కి ఏర్పాట్లు మొదలయ్యాయట. సాధారణంగా జులై తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఉంటుంది. ఈసారి మార్చిలోనే షో బిగిన్ కానుందట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలుపెట్టారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే శివాజీ హోస్ట్ గా చేస్తున్నారట.
అయితే బిగ్ బాస్ హోస్ట్ గా కాదు. బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా శివాజీ చేయనున్నారట. ఎలిమినేటై బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ని శివాజీ ఇంటర్వ్యూ చేయనున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
షో నుండి బయటకు వచ్చిన శివాజీ బిగ్ బాస్ షోపై ఆరోపణలు చేశాడు. తనను కావాలనే విలన్ గా చూపించారు. ఎడిటింగ్ తో తప్పుగా చూపించారని శివాజీ అన్నారు. బిగ్ బాస్ టీమ్ లో ఎవరో ఒకరు ఇదంతా చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు.
అమర్ దీప్ ని లేపారని పరోక్షంగా చెప్పాడు. అతనికి రన్నర్ అయ్యే అర్హత లేదన్నాడు. అయితే విన్నర్ కంటే రెమ్యూనరేషన్ రూపంలో తనకే ఎక్కువ డబ్బులు వచ్చాయని శివాజీ ఒప్పుకోవడం విశేషం.