Bigg Boss 7 Grand Finale: ఈసారి టైటిల్ విన్నర్ బ్యాడ్ లక్... 50 లక్షల్లో చేతికి వచ్చేది కేవలం ఇంతే!

First Published Dec 17, 2023, 7:07 PM IST

బిగ్ బాస్ షోకి వెళ్లాలని లక్షల మంది కలలుగంటారు. కొందరికి మాత్రమే ఆ అవకాశం దక్కుతుంది. ఆ షోకి వెళ్లాలని టెంప్ట్ చేసే అంశాల్లో ప్రైజ్ మనీ ప్రధానమైనది. పేరుకే యాభై లక్షలు కానీ, చేతికి వచ్చేది చాలా తక్కువ. 

బిగ్ బాస్ అతిపెద్ద రియాలిటీ షోలలో ఒకటి. కోన్ బనేగా కరోడ్ పతి తర్వాత భారీ ప్రైజ్ మనీ ఆఫర్ చేస్తున్న షో. పలు భాషల్లో ప్రాచుర్యం పొందిన బిగ్ బాస్ షో విన్నర్ కి రూ. 50 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తారు. వీటితో పాటు మరో రూ. 20 లక్షల విలువైన బహుమతులు ఉంటాయి. 

అయితే విన్నర్ ప్రైజ్ మనీలో భారీ కోతలు ఉంటాయి. ప్రైజ్ మనీ రూపంలో ఓ వ్యక్తి గెల్చుకున్న మొత్తంపై భారీగా టాక్స్ వేస్తారు. అది లాటరీ కావచ్చు, రియాలిటీ షోలో గెలుచుకున్న మొత్తం కావచ్చు. టీడీఎస్ రూపం 31.2% చెల్లించాలి. జీఎస్టీతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఛార్జులు ఉంటాయి. గతంలో బిగ్ బాస్ విన్నర్ రూ. 50 లక్షలు గెలుచుకుంటే టాక్స్ కటింగ్స్ పోను రూ. 37 లక్షలు చేతికి వచ్చేవి. 

Latest Videos


Bigg Boss Telugu 7

గత రెండు సీజన్స్ నుండి కేవలం రూ. 23 లక్షలు వస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సీజన్ 5 విన్నర్ సన్నీ తెలియజేశాడు. గెలిచింది నేను డబ్బులు తీసుకుంది గవర్నమెంట్ అని సెటైర్ వేశాడు. గెలిచిన ప్రైజ్ మనీ, బహుమతుల నుండి నాకు మిగిలింది ఏమీ లేదు. టాక్స్ ల రూపంలోనే మొత్తం పోయిందని సన్నీ అన్నాడు. 

Bigg Boss Telugu 7

ఇక లేటెస్ట్ సీజన్ 7 విన్నర్ రెమ్యూనరేషన్ మరింత దారుణం అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని టాప్ 3 నుండి తప్పుకున్నాడట. ఆ పదిహేను లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుండి తగ్గిస్తారు. మిగిలింది రూ. 35 లక్షలు. టాక్స్ కటింగ్స్ పోను రూ. 16 లక్షలు విన్నర్ చేతికి వస్తాయని సమాచారం. 

యాభై లక్షలు ఎక్కడ పదహారు లక్షల ఎక్కడ?. ప్రైజ్ మనీతో పాటు విన్నర్ కి ఒక మారుతీ సుజుకీ బ్రీజా, రూ. 15 లక్షల విలువైన డైమండ్ జ్యువెలరీ ఇవ్వనున్నారు. వీటి మీద కూడా టాక్స్ పడుతుంది. ఆ పదహారు లక్షల నుండి టాక్స్ చెల్లిస్తే ఈ రెండు బహుమతులు సొంతం అవుతాయి. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అని గట్టిగా ప్రచారం అవుతుంది. 

Bigg Boss Telugu 7

కాబట్టి టైటిల్ విన్నర్ గా ఆయనకు పెద్దగా ఒరిగింది ఏం లేదని అంటున్నారు. అయితే ఎంత మొత్తం గెలిచినా ప్రశాంత్ అది పేద రైతులకు ఇచ్చేస్తానని చెప్పాడు. కాబట్టి పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడో చూడాలి... 

click me!