గురువు శివాజీని గాల్లోకి ఎత్తేసిన శిష్యులు ప్రశాంత్, యావర్... స్పై బ్యాచ్ ఈజ్ బ్యాక్!

First Published Dec 25, 2023, 11:54 AM IST

బిగ్ బాస్ తెలుగు 7 లో స్పై బ్యాచ్ గా ప్రచారం అయ్యారు శివాజీ, ప్రశాంత్, యావర్. షో ముగిశాక మొదటిసారి వీరు కలిశారు. దీంతో వారి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 
 

బిగ్ బాస్ సీజన్ 7లో రెండు బ్యాచ్ ల మధ్య పోటీ ప్రధానంగా సాగింది. సీరియల్ నటులైన అమర్ దీప్, ప్రియాంక జైన, శోభ శెట్టి... డే వన్ నుండి గ్రూప్ గేమ్ స్టార్ట్ చేశారు. ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. ఇది నచ్చని శివాజీ తన టీమ్ ఫార్మ్ చేశాడు. రైతుబిడ్డ ప్రశాంత్, యావర్... శివాజీ శిష్యులు అయ్యారు. 

ప్రశాంత్, యావర్ లకు శివాజీ గట్టి సపోర్ట్ ఇచ్చాడు. స్ట్రాంగ్ ప్లేయర్స్ అయిన వారిద్దరూ శివాజీ టీమ్ సభ్యులు కావడం అతనికి కలిసొచ్చింది. ఇక శోభ, ప్రియాంక అమర్ లు స్పా బ్యాచ్ గా, శివాజీ, ప్రశాంత్, యావర్ లు స్పై బ్యాచ్ గా పేరు గాంచారు. టైటిల్ రేసు కూడా ఈ రెండు గ్రూప్ సభ్యుల మధ్యే సాగింది. 

Latest Videos


మొదటి నుండి శివాజీ టైటిల్ రేసులో ఉన్నాడు. చివరి వారాల్లో శివాజీ వెనక్కి తగ్గాడు. అమర్, ప్రశాంత్ రేసులో దూసుకు వచ్చారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా అమర్ రన్నర్ అయ్యాడు. శివాజీకి మూడో స్థానం దక్కింది. నాలుగో స్థానంలో యావర్ నిలిచాడు. 

హౌస్లో శివాజీ, ప్రశాంత్, యావర్ ల మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడింది. వీరికి మ్యూచ్యువల్ ఫ్యాన్స్ ఏర్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక వీరు కలవలేదు.

అనూహ్య పరిణామాల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. కోర్టు రిమాండ్ విధించింది. దాంతో రెండు రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. 

ఎట్టకేలకు స్పై బ్యాచ్ కలిశారు. పల్లవి ప్రశాంత్, యావర్ శివాజీ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తుంది. యావర్, ప్రశాంత్  శివాజీ ఇంట్లో భోజనం చేశారట. అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. శివాజీ, యావర్, ప్రశాంత్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీరితో నయని, పావని, టేస్టీ తేజ జాయిన్ అయ్యారు. 

అనంతరం వీరందరూ భోలే ఇంట్లో కూడా వీరు కలిశారని తెలుస్తుంది.. భోలే తోటి కంటెస్టెంట్స్ కి ఆతిథ్యం ఇచ్చాడు. శివాజీ, యావర్, ప్రశాంత్, భోలే, శుభశ్రీ, నయని పావని అనంతరం ఫోటోలకు ఫోజిచ్చారు. కాగా వీరితో సీరియల్ బ్యాచ్ జాయిన్ కాకపోవడం విశేషం. ముఖ్యంగా అమర్ పార్టీలలో తక్కువగా కనిపిస్తున్నాడు. 

click me!