ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియో వెలుపల గందరగోళం నెలకొంది. గ్రాండ్ ఫినాలే నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఫినాలే ముగిసిన తర్వాత టాప్ 6 గా ఉన్న శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, అర్జున్, యావర్ బయటకు వచ్చారు. వీరిలో కొందరిపై దాడి జరిగింది.