నందు వాళ్ళ అమ్మ, లాస్య ని నందుని పనోళ్ళు అని ఎక్కిరిస్తుంది. కొంచెం మర్యాదగా మాట్లాడండి అని వాళ్ళని తిడుతుంది లాస్య. "సామ్రాట్ గారూ ప్రాజెక్టు కోసం ఇక్కడికి రమ్మంన్నారు కనుక వచ్చాము, లేకపోతే మాకు ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు వెళ్ళిపోతాము, నీకే నష్టం" అని లాస్య అనగా, వెళ్లిపోండి అని తులసి అంటుంది, ఇంట్లో వాళ్ళందరూ లాస్య నీ చూసి నవ్వుతారు. ఇలాగ కొన్ని వాదనలు అయిన తర్వాత లాస్య ,నందు "ఇందాక మేము మాట్లాడిన మాటలు మర్చిపోండి మేము కేవలం ప్రాజెక్టు గురించి వచ్చాము" అని నెమ్మదిగా అనగా తులసి వాళ్ళని లోపలికి రమ్మని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతారు.